Just In
- 7 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 8 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 11 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 13 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్కి ఇది తప్పని సరి.. లేకుంటే?
ప్రపంచవ్యాప్తంగా రోడ్డుప్రమాదాల వల్ల మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకి ఎక్కువవుతోంది. ప్రపంచంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. రోడ్డుప్రమాదాలు జరగటానికి ముఖ్య కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు మితిమీరిన వేగం.
ఇవన్నీ నివారించి రోడ్డు ప్రమాదాలను వీలైనంతవరకు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరియు సంబంధిత రాష్ట్రప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం లేదు.
అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరు నగరంలో రోడ్డుప్రమాదాల వల్ల జరిగే నష్టాలను అరికట్టడానికి నగర ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా రియర్ వ్యూ మిర్రర్స్ మరియు ఇండికేటర్స్ లేని వాహనాలకు భారీగా జరిమానా విధిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రదహన కారణాలలో ఒకటి ద్విచక్ర వాహనాలకు రియర్ వ్యూ మిర్రర్స్ లేకపోవడం, వెళ్తున్నప్పుడు కుడి లేదా ఎడమవైపుకు వెల్లాసి వచ్చినప్పుడు టర్న్ ఇండికేటర్లను ఉపయోగించకపోవడం అని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కారణంగానే మిర్రర్స్ మరియు ఇండికేటర్స్ లేని వాహనాలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు.
MOST READ:సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?
ఇకపై రోడ్డుపై తిరిగే ద్విచక్రవాహనాలకు రియర్వ్యూ మిర్రర్స్ మరియు ఇండికేటర్స్ లేకుంటే 500 రూపాయల జరిమానా విధించబడుతుంది. పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం రియర్ వ్యూ మిర్రర్ మరియు ఇండికేటర్స్ వాడకం వల్ల ప్రమాదాల సంఖ్య బాగా తగ్గుతుంది అన్నారు.
బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు జరీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం బెంగళూరులో ద్విచక్ర వాహనదారులు ఎక్కువ జరుగుతున్న ప్రమాదాల వల్ల భయబ్రాంతులవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలకు ప్రధాన కారణం రియర్వ్యూ మిర్రర్ లేని బైకుల వాడకం.
MOST READ:మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?
ప్రస్తుతం వెలువడిన ఉత్తర్వుల ప్రకారం రియర్ వ్యూ మిర్రర్ మరియు ఇండికేటర్ లేని వాహనాలు గుర్తించబడితే పోలీసులు అలాంటి వాహనాలకు భారీగా జరిమానా విధిస్తారు. దీనిని వాహనదారులు దృష్టిలో ఉంచుకోవాలి. ఈ రూల్స్ తమ బైకులను వేరేవాళ్లకు ఇచ్చినట్లయితే వాటికీ కూడా వర్తిస్తుంది.
అంటే బైక్లను అవసరానికి తీసుకుని వారు పోలీసులకు పట్టుబడితే జరిమానా అసలైన వాహన యజమాని చెల్లించాల్సి వస్తుంది. దీనితో పాటు బైక్లను అద్దెకు తీసుకున్న వ్యక్తికి బదులుగా ద్విచక్ర వాహనాలను అద్దెకు తీసుకునే కంపెనీలను జరిమానా విధించాలని వాహనదారులు పోలీసులు డిమాండ్ చేస్తున్నారు.
MOST READ:బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..
రవాణా శాఖ ఆంధిచిన అధికారిక సమాచారం ప్రకారం, గత ఏడాది జనవరి నాటికి, బెంగళూరులో 1 కోటికి పైగా రిజిస్టర్ చేయబడిన వాహనాలు ఉన్నట్లు తెలిసింది. వీటిలో దాదాపు 64 లక్షలకు పైగా బైకులు మాత్రమే ఉన్నాయి. కావున ఎక్కువగా ఉన్న ద్విచక్ర వాహనాల వల్ల ప్రమాదాల స్థాయి అధికంగా ఉంది.
ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాల తనిఖీని మరింత ఎక్కువగా చేయడానికి పూనుకున్నారు. చాలా మంది బైక్ రైడర్లు తమ ద్విచక్ర వాహనాలకు ఉన్న రియర్ వ్యూ మిర్రర్స్ తొలగిస్తున్నారు. ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది, దీనిని వాహనదారుడు తప్పక గుర్తించాలి.
MOST READ:మీకు తెలుసా.. బజాజ్ సిటి 100 & ప్లాటిన రేంజ్ కొత్త ధరల లిస్ట్ వచ్చేసింది
రియర్ వ్యూ మిర్రర్స్ లేకుండా తిరిగేటప్పుడు వెనుక నుంచే వాహనాలను సకాలంలో గుర్తించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయం తెలియక చాలామంది ప్రజలు కొంత స్టైల్ కోసం తమ ద్విచక్ర వాహనాల నుండి రియర్వ్యూ అద్దాలను తొలగిస్తున్నారు.
కొంతమంది ద్విచక్ర వాహన యజమానులు అందించిన సమాచారం ప్రకారం వారు తమ బైక్ పార్క్ చేసిన సమయంలో హ్=గుర్తు తెలియని వారు వారి బైక్స్ యొక్క రియర్ వ్యూ మిర్రస్ దొంగలిస్తున్నారని తెలిపారు. ఇటువంటి దొంగతనాలను నివారించడానికి పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైనా వాహనదారులు రియర్ వ్యూ మిర్రర్స్ మరియు ఇండికేటర్స్ యొక్క ప్రధానాయతను ఇప్పటికైనా తప్పకుండా తెలుసుకోవాలి.