Just In
- 14 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 15 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 17 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 20 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కేరళలో ఇప్పుడు కొత్త రకం టూరిజం.. బోట్ హౌస్ల మాదిరిగా బస్సు హౌస్లు..
జర్మన్ ఆటోమొబైల్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్కు చెందిన భారతీయ ట్రక్ మరియు బస్సుల తయారీ సంస్థ భారత్బెంజ్ (BharatBenz) కేరళ పర్యాటక శాఖ కోసం కొత్త కస్టమైజ్డ్ కారావాన్ (Caravan) ను ప్రారంభించింది. రాష్ట్రంలో కారావాన్ టూరిజాన్ని ప్రవేశపెట్టడానికి పర్యాటక శాఖ ప్రకటించిన ప్రణాళికలో భాగంగా కొత్త కారావాన్ ను విడుదల చేశారు.
ఆటోబాన్ ట్రకింగ్ డీలర్షిప్ మరియు జెసిబిఎల్ గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్ అయిన రెడీ-ఫర్ రోడ్ క్యాంపర్ వాన్ కేరళ యొక్క తాజా వెంచర్ కారవాన్ కేరళలో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగించబడుతుంది. ఈ అత్యాధునికమైన కారావాన్ను పర్యాటక శాఖ మంత్రి పిఏ మహ్మద్ రియాజ్ మరియు రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు ప్రారంభించారు.
ఈ టూరిస్ట్ కారవాన్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది. ఈ వాహనం పర్యాటకుల కోసం పర్యాటక కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలతో అమర్చబడి ఉంటుంది. ఈ కొత్త చొరవ కింద, కేరళ పర్యాటక శాఖ కోవిడ్ అనంతర ప్రయాణ ప్రాధాన్యతలకు అనుగుణంగా రాష్ట్రంలో క్యాంపింగ్ సంస్కృతిని ప్రోత్సహించాలని భావిస్తోంది.
భారతదేశానికి తగిన ఫీచర్లతో లగ్జరీ క్యాంపర్ కారావాన్ను నిర్మించడానికి ప్రభుత్వం భారత్ బెంజ్ ను కూడా సంప్రదించింది. సాధారణంగా, కారావాన్లు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే, వీటిని సాధారణ ప్రజలకు కూడా తక్కువ ఖర్చుతో ఉపయోగపడేలా ప్లాన్ రూపొందించబడింది.
కేరళ పర్యాటక శాఖ ప్రకారం, ఇది ప్రకృతికి అనుగుణంగా ఉండే మరియు సందర్శకుల భద్రతకు భరోసా ఇచ్చే విధానం. ఈ లగ్జరీ కారవాన్లు భరత్బెంజ్ 1017 బస్సు చాస్సిస్ పై నిర్మించబడ్డాయి. ఇది రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఇద్దరు నుండి నలుగురు ప్రయాణీకుల కోసం సౌకర్యవంతంగా మరియు విలాసవంతంగా రూపొందించబడింది.
ఈ వాహనంలో విశాలమైన లాంజ్ ప్రాంతం, రిక్లైనర్ సీట్లు మరియు టెలివిజన్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అంతాకుకండా, ఈ కారావాన్లో రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, ఇండక్షన్ కుక్టాప్ మరియు టేబుల్వేర్ కోసం అనుకూలీకరించిన నిల్వతో సహా అవసరమైన అన్ని పరికరాలతో కూడిన వంటగది కూడా ఉంది.
పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కలిగిన ఈ కారావాన్లో ఓ పడకగది కూడా ఉంటుంది. ఇది సౌకర్యవంతమైన డబుల్-బంక్ పడకలను కలిగి ఉంటుంది. స్నానం చేయడానికి మరియు బాత్రూమ్ అవసరాల కోసం ఇందులో షవర్తో కూడిన బాత్రూమ్ కూడా ఉంటుంది. ఈ కారావాన్ యొక్క మరొక ఆకర్షణ ఏంటంటే, ప్రత్యేక భద్రతా కవర్తో కూడిన బహిరంగ సీటింగ్.
ఈ వాహన నిర్మాణం అన్ని కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్ చేయబడింది. అంతేకాకుండా, భరత్బెంజ్ 1017 యొక్క ఇంధన సమర్థవంతమైన బిఎస్-6 ఇంజిన్తో దాని పారబోలిక్ సస్పెన్షన్తో సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన రైడ్ను అందిస్తుంది. బస్ చట్రం డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికిల్ ఒరగడం లోని అత్యాధునిక తయారీ కర్మాగారంలో తయారు చేయబడింది.
కేరళ ప్రభుత్వం కూడా ఈ పథకం కింద నమోదు చేసుకున్న కారావాన్ ల కోసం ప్రత్యేక లోగోను కూడా జారీ చేయనుంది. ఈ చర్య వలన అనవసరమైన తనిఖీల నుండి పర్యాటక కారావాన్ లను నివారించడానికి ఇది సహాయపడుతుంది. కారావాన్ టూరిజం మూడు దశాబ్దాల తర్వాత పూర్తి పరివర్తనకు నాంది పలికింది. పగటి పూట ప్రయాణం మరియు రాత్రి పూట విశ్రాంతిని అందించేలా ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది.
దీని ప్రధాన భాగస్వాములు ప్రైవేట్ పెట్టుబడిదారులు, టూర్ ఆపరేటర్లు మరియు స్థానిక సంఘాలు. కారవాన్ ఆపరేటర్లకు ప్రోత్సాహకాల కోసం పెట్టుబడి రాయితీ కూడా ఇవ్వబడుతుంది. కెట్టువెల్లం ఎనభైల చివరలో కేరళలో ఉద్భవించిన పర్యాటక ప్రాజెక్ట్ ఇది. ఈ కారవాన్ టూరిజం రాబోయే రోజుల్లో ఇదే తరహా మోడల్గా పిలువబడుతుందని ఆశిస్తున్నారు.
కోవిడ్ అనంతర పర్యాటక అభివృద్ధి కోసం మంత్రి మహ్మద్ రియాజ్ తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. కారవాన్లో పర్యాటకుల పూర్తి భద్రతను నిర్ధారించడానికి వాహనాలు ఐటి ఆధారిత ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండేలా చూడటం ఆమోదయోగ్యమైన చర్య. కేరళ ప్రభుత్వం అమలు చేసిన కారవాన్ రాబోయే రోజుల్లో కొత్త పర్యాటక ఆదాయాన్ని సృష్టిస్తుందని భావిస్తున్నారు.