Just In
- 12 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 14 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 15 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు
కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో చాలా విస్తృతంగా వ్యాపిస్తూ ఎంతోమంది ప్రజల ప్రాణాలను హరిస్తోంది. రోజు రోజుకి కరోనావైరస్ వ్యాప్తి వేగవంతం అవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోగులకు కావలసినన్ని బెడ్లు, ఆక్సిజన్ మరియు అంబులెన్సులు అందుబాటులో లేదు. కావున ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇదిలా ఉంటె కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది పేద ప్రజలు కనీసం నిత్యావసరాలు కూడా లేకుండా కష్టపడుతున్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని చాలామంది వారికి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే నటుడు భువన్ పొన్నన్న, నటి హర్షిక పూంచ భువనం ఫౌండేషన్ ద్వారా కరొనాతో ఇబ్బంది పడుతున్నవారికి ఆహారానికి అవసరమైన సామగ్రి మరియు ఆక్సిజన్ వంటి వాటిని అందిస్తున్నారు.
ఈ కరోనా కష్ట కాలంలో నటుడు, భువన్ పొన్నన్న, హర్షిక భువనం ఫౌండేషన్ 'భువనం' మరియు 'భాంధవ' అనే పేరుతో రెండు సర్వీసులను ప్రారంభించారు. ఈ రెండు సర్వీసులను ఫ్రీడమ్ పార్క్ వద్ద ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు. ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న వారికి రెండు ఆక్సిజన్ బస్సులు కూడా ఏర్పాటు చేశారు.
MOST READ:స్పాట్ టెస్ట్లో కనిపించిన కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్; వివరాలు
అదే విధంగా భాందవ అనే ఆటోల ద్వారా మందులు, కిరాణా వస్తువులు, భోజనం మరియు ఆక్సిజన్ ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సర్వీస్ బెంగళూరులో నిర్వహించబడుతోంది, అయితే ఈ సర్వీస్ కేవలం బెంగళూరుకి మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రమంతటా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు భువన్ పొన్నన్న తెలిపారు.
భువన్ పొన్నన్న మరియు హర్షిక పూంచ ఈ సమయంలో చేస్తున్నఉదారమైన ఈ పనికి ఎంతోమంది వారిని ప్రశంసిస్తున్నారు. భువన్ పొన్నన్న ఇంతకు ముందు పేద ప్రజల సహాయార్థం హెల్ప్లైన్ కూడా ప్రారంభించారు. సహాయం అవసరమైన వారికి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా కాల్ చేయడానికి ప్రైవేట్ నంబర్ ఇవ్వబడింది.
MOST READ:స్పెషల్ కార్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మున్సిపల్ కార్పొరేషన్; వివరాలు
ఈ హెల్ప్లైన్ నెంబర్ కి రోజుకు 3,000 నుంచి 4,000 కాల్స్ రావడం ప్రారంభమైంది. అప్పుడు అతను దాని కోసం ఒక బృందాన్ని సృష్టించి చాలా మందికి సహాయం చేశాడు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కూడా వీరు చేస్తున్న పనికి ఎంతోమంది మెచ్చుకున్నారు.
ఇటీవల ఒక వారం క్రితం, సుమారు 150 కుటుంబాలకు ఆహార వస్తు సామగ్రిని కూడా పంపిణీ చేశారు. వీరు అందించిన ఈ ఆహార సామగ్రిలో బియ్యం, పప్పుధాన్యాలు, చక్కెర, వంట నూనె, గోధుమ పిండి మరియు కూరగాయలు వంటివి ఉన్నాయి.
MOST READ:బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు
గతంలో కూడా భువన్ పొన్నన్న, హర్షిక పూంచ చామందికి పేదప్రజలకు సహాయం చేసినట్లు కూడా తెలిసింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ మహమ్మరి అధికంగా విస్తరిస్తున్న సమయంలో ప్రజలకు ఉదారంగా సేవలందిస్తూ ఎంతోమంది ప్రశంసలు పొందుతున్నారు.