Just In
- 11 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 12 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 16 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 17 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Movies Karthika Deepam 2 April 24th: దీప తాళికట్టిన భార్య.. నరసింహ చెప్ప పగలగొట్టిన సుమిత్ర
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు
కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో చాలా విస్తృతంగా వ్యాపిస్తూ ఎంతోమంది ప్రజల ప్రాణాలను హరిస్తోంది. రోజు రోజుకి కరోనావైరస్ వ్యాప్తి వేగవంతం అవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోగులకు కావలసినన్ని బెడ్లు, ఆక్సిజన్ మరియు అంబులెన్సులు అందుబాటులో లేదు. కావున ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇదిలా ఉంటె కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది పేద ప్రజలు కనీసం నిత్యావసరాలు కూడా లేకుండా కష్టపడుతున్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని చాలామంది వారికి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే నటుడు భువన్ పొన్నన్న, నటి హర్షిక పూంచ భువనం ఫౌండేషన్ ద్వారా కరొనాతో ఇబ్బంది పడుతున్నవారికి ఆహారానికి అవసరమైన సామగ్రి మరియు ఆక్సిజన్ వంటి వాటిని అందిస్తున్నారు.
ఈ కరోనా కష్ట కాలంలో నటుడు, భువన్ పొన్నన్న, హర్షిక భువనం ఫౌండేషన్ 'భువనం' మరియు 'భాంధవ' అనే పేరుతో రెండు సర్వీసులను ప్రారంభించారు. ఈ రెండు సర్వీసులను ఫ్రీడమ్ పార్క్ వద్ద ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు. ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న వారికి రెండు ఆక్సిజన్ బస్సులు కూడా ఏర్పాటు చేశారు.
MOST READ:స్పాట్ టెస్ట్లో కనిపించిన కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్; వివరాలు
అదే విధంగా భాందవ అనే ఆటోల ద్వారా మందులు, కిరాణా వస్తువులు, భోజనం మరియు ఆక్సిజన్ ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సర్వీస్ బెంగళూరులో నిర్వహించబడుతోంది, అయితే ఈ సర్వీస్ కేవలం బెంగళూరుకి మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రమంతటా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు భువన్ పొన్నన్న తెలిపారు.
భువన్ పొన్నన్న మరియు హర్షిక పూంచ ఈ సమయంలో చేస్తున్నఉదారమైన ఈ పనికి ఎంతోమంది వారిని ప్రశంసిస్తున్నారు. భువన్ పొన్నన్న ఇంతకు ముందు పేద ప్రజల సహాయార్థం హెల్ప్లైన్ కూడా ప్రారంభించారు. సహాయం అవసరమైన వారికి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా కాల్ చేయడానికి ప్రైవేట్ నంబర్ ఇవ్వబడింది.
MOST READ:స్పెషల్ కార్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మున్సిపల్ కార్పొరేషన్; వివరాలు
ఈ హెల్ప్లైన్ నెంబర్ కి రోజుకు 3,000 నుంచి 4,000 కాల్స్ రావడం ప్రారంభమైంది. అప్పుడు అతను దాని కోసం ఒక బృందాన్ని సృష్టించి చాలా మందికి సహాయం చేశాడు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కూడా వీరు చేస్తున్న పనికి ఎంతోమంది మెచ్చుకున్నారు.
ఇటీవల ఒక వారం క్రితం, సుమారు 150 కుటుంబాలకు ఆహార వస్తు సామగ్రిని కూడా పంపిణీ చేశారు. వీరు అందించిన ఈ ఆహార సామగ్రిలో బియ్యం, పప్పుధాన్యాలు, చక్కెర, వంట నూనె, గోధుమ పిండి మరియు కూరగాయలు వంటివి ఉన్నాయి.
MOST READ:బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు
గతంలో కూడా భువన్ పొన్నన్న, హర్షిక పూంచ చామందికి పేదప్రజలకు సహాయం చేసినట్లు కూడా తెలిసింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ మహమ్మరి అధికంగా విస్తరిస్తున్న సమయంలో ప్రజలకు ఉదారంగా సేవలందిస్తూ ఎంతోమంది ప్రశంసలు పొందుతున్నారు.