Just In
- 5 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 5 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 6 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 8 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నీటితో నడిచే ఇంజిన్ను కనుగొన్న యువ సైంటిస్ట్
నేడు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం మొత్తం కాలుష్యానికి గురవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ మరియు డెవలప్మెంట్ అనే పేరుతో అడవులను నాసనమ్ చేస్తూ, ఫ్యాక్టరీలు నిర్మించడం వల్ల వాతావరణం ఊహకందని రీతిలో కాలుష్యానికి గురవుతుంది. ఇది మాత్రమే కాకుండా పెరుగుతున్న జనాభాతో వాహనాల వినియోగం కూడా పెరుగుతోంది. వాహనాలవల్ల కూడా కాలుష్యం జరుగుతోంది.
ఇప్పుడిప్పుడే మనదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలుగా, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా కొంతమంది మేధావులలా తెలివితేటలవల్ల నీటితో నడిచే యంత్రాలు కూడా కనుగొనబడుతున్నాయి. ఈ విధానగా నీటితో నడిజె ఇంజిన్ ని కనిపెట్టాడు ఒక యువ సైంటిస్ట్. దీని గురించి మరిన్ని వివరాలు మీ కోసం..
బీహార్ రాష్ట్రంలోని కటియార్ జిల్లాకి చెందిన ఒక యువ సైంటిస్ట్ అయిన 'రిబమ్' నీటితో పనిచేసే ఇంజిన్ ని కనుగొన్నాడు. ఈ నీటితో నడిచే ఇంజిన్ వాళ్ళ పూర్తిగా వాతావరణానికి ఎటువంటి హాని జరగదు.
రిబమ్ తయారుచేసిన ఇంజిన్ శక్తిని పొందటానికి నీటిని మాత్రమే ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లకంటే శక్తివంతమైనది. అంతే కాకుండా ఇది వాతావరణానికి కాలుష్య కారకం కాదు.
రిబమ్ తాన చేసిన అద్భుత సృష్టి గురించి డిడి న్యూస్ ఛానల్లో వివరించారు. తానూ చేసిన పరిశోధనకు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికా వంటి దేశాలలో కూడా ప్రశంసించబడ్డాడు.
రిబమ్ చేసిన పరిశోధనలకు మెచ్చి అమెరికా ప్రభుత్వం తన ఉన్నత చదువుకు పూర్తి ఖర్చును భాద్యతలను భరిస్తామని తెలిపింది. ఈ యువ శాస్త్రవేత్త కూడా తన ఉన్నత చదువుకి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నట్లు తెలిపాడు.
రిబమ్ తాను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి క్లీన్ ఎనర్జీ ఫీల్డ్ తయారీ కోసం ప్రయతనాలు కొనసాగిస్తున్నాడు. ఈ ఇంజిన్ గురించి రిబమ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది నీటితో నడిచే హైడ్రో కెమికల్ ఇంజిన్ అని చెప్పారు.
ఈ ఇంజిన్ గురించి తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని ఉయోగించాలంటే ముందుగా నీటితో నింపాల్సి ఉంటుంది. ఈ విధంగా నీటిని నింపిన తరువాత ఇది శక్తిని విడుదల చేయడం ప్రారంభిస్తుంది. ఈ ఇంజిన్ వల్ల వాతావరణానికి ఎలాంటి హాని జరగదు.
నీటితో నడిచే ఈ ఇంజన్ డీజిల్, పెట్రోల్ ఇంజన్ల కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందని రిబమ్ చెప్పారు. ఈ ఇంజిన్ను అభివృద్ధి చేసినందుకు ఈ యువకున్ని చాల మంది అభినందించారు.
రిబమ్ చేసిన ఈ పరిశోధన ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరిని ఆకర్షించింది. రిబమ్ పరిశోధన ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పును తీసుకురానుంది. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పరిశోధన చేసిన రిబమ్ అభినందనీయుడు.