Just In
- 1 hr ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 3 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
- 3 hrs ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 7 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
Don't Miss
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
నీటితో నడిచే ఇంజిన్ను కనుగొన్న యువ సైంటిస్ట్
నేడు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం మొత్తం కాలుష్యానికి గురవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ మరియు డెవలప్మెంట్ అనే పేరుతో అడవులను నాసనమ్ చేస్తూ, ఫ్యాక్టరీలు నిర్మించడం వల్ల వాతావరణం ఊహకందని రీతిలో కాలుష్యానికి గురవుతుంది. ఇది మాత్రమే కాకుండా పెరుగుతున్న జనాభాతో వాహనాల వినియోగం కూడా పెరుగుతోంది. వాహనాలవల్ల కూడా కాలుష్యం జరుగుతోంది.
ఇప్పుడిప్పుడే మనదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలుగా, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా కొంతమంది మేధావులలా తెలివితేటలవల్ల నీటితో నడిచే యంత్రాలు కూడా కనుగొనబడుతున్నాయి. ఈ విధానగా నీటితో నడిజె ఇంజిన్ ని కనిపెట్టాడు ఒక యువ సైంటిస్ట్. దీని గురించి మరిన్ని వివరాలు మీ కోసం..
బీహార్ రాష్ట్రంలోని కటియార్ జిల్లాకి చెందిన ఒక యువ సైంటిస్ట్ అయిన 'రిబమ్' నీటితో పనిచేసే ఇంజిన్ ని కనుగొన్నాడు. ఈ నీటితో నడిచే ఇంజిన్ వాళ్ళ పూర్తిగా వాతావరణానికి ఎటువంటి హాని జరగదు.
రిబమ్ తయారుచేసిన ఇంజిన్ శక్తిని పొందటానికి నీటిని మాత్రమే ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లకంటే శక్తివంతమైనది. అంతే కాకుండా ఇది వాతావరణానికి కాలుష్య కారకం కాదు.
రిబమ్ తాన చేసిన అద్భుత సృష్టి గురించి డిడి న్యూస్ ఛానల్లో వివరించారు. తానూ చేసిన పరిశోధనకు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికా వంటి దేశాలలో కూడా ప్రశంసించబడ్డాడు.
రిబమ్ చేసిన పరిశోధనలకు మెచ్చి అమెరికా ప్రభుత్వం తన ఉన్నత చదువుకు పూర్తి ఖర్చును భాద్యతలను భరిస్తామని తెలిపింది. ఈ యువ శాస్త్రవేత్త కూడా తన ఉన్నత చదువుకి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నట్లు తెలిపాడు.
రిబమ్ తాను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి క్లీన్ ఎనర్జీ ఫీల్డ్ తయారీ కోసం ప్రయతనాలు కొనసాగిస్తున్నాడు. ఈ ఇంజిన్ గురించి రిబమ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది నీటితో నడిచే హైడ్రో కెమికల్ ఇంజిన్ అని చెప్పారు.
ఈ ఇంజిన్ గురించి తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని ఉయోగించాలంటే ముందుగా నీటితో నింపాల్సి ఉంటుంది. ఈ విధంగా నీటిని నింపిన తరువాత ఇది శక్తిని విడుదల చేయడం ప్రారంభిస్తుంది. ఈ ఇంజిన్ వల్ల వాతావరణానికి ఎలాంటి హాని జరగదు.
నీటితో నడిచే ఈ ఇంజన్ డీజిల్, పెట్రోల్ ఇంజన్ల కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందని రిబమ్ చెప్పారు. ఈ ఇంజిన్ను అభివృద్ధి చేసినందుకు ఈ యువకున్ని చాల మంది అభినందించారు.
రిబమ్ చేసిన ఈ పరిశోధన ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరిని ఆకర్షించింది. రిబమ్ పరిశోధన ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పును తీసుకురానుంది. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పరిశోధన చేసిన రిబమ్ అభినందనీయుడు.