కారు ఆపినందుకు డ్యూటీలో ఉన్న హోమ్ గార్డ్ తో గుంజీలు తీయించిన వ్యవసాయాధికారి, చివరికి ఏమైందంటే..?
భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల దాదాపు 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు. కానీ వైరస్ మరింత ఎక్కువగా వ్యాపించిన కారణంగా ఈ లాక్ డౌన్ కాస్త 2020 మే 03 వరకు పొడిగిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కారణంగా భారత దేశంలో లాక్ డౌన్ రెండవ దశ అమలులో ఉంది.

కరోనా వైరస్ నివారించడానికి కేంద్ర రస్తా ప్రభుత్వాలు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రజలకు అవగాహనా కల్పించడానికి చాలా రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు తమ కార్యకలాపాలను ఆంక్షలతో ప్రారంభించడానికి అనుమతించినప్పటికీ, పోలీసులు మరియు అధికారులు రోడ్లపై వాహనాలను ఆపివేస్తూ చెల్లుబాటు అయ్యే కర్ఫ్యూ పాస్ మరియు ఇళ్ళ నుండి బయటకు రావడానికి కారణాన్ని అడుగుతున్నారు.

బీహార్ లోని అరేరియాలో యూనిఫాంలో ఉన్న ఒక హోమ్ గార్డ్ నిబంధనలను పాటించాడు. ఈ నేపథ్యంలో ఒక వాహనాన్ని ఆపాడు. అయితే వాహనం లోపల ఉన్న వ్యక్తి ప్రభుత్వ అధికారి అని తేలింది. ఆ తర్వాత తన కారును ఆపినందుకు హోమ్ గార్డ్ గణేష్ లాల్ తత్మా ఆ గవర్నమెంట్ ఆఫీసర్ శిక్షించాడు.

బీహార్లోని అరియరియాలో ఈ సంఘటన జరిగింది. సీనియర్ వ్యవసాయ అధికారి మనోజ్ కుమార్ తన కారును ఆపిన హోమ్ గార్డ్ను 50 సిట్ అప్లు తీయమని చెప్పారు. సిట్-అప్స్ చేస్తున్న వ్యక్తి యొక్క వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది మరియు ఇది సోషల్ మీడియా ప్లేట్ ఫామ్ వినియోగదారులలో చాలా ఆగ్రహాన్ని కలిగించింది.

బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గుప్తేశ్వర్ పాండే ఈ సంఘటనను గమనించి, దర్యాప్తు తర్వాత ఆ వ్యక్తిపై బలమైన చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పారు. హోమ్ గార్డ్ సిట్-అప్స్ చేయమని అధికారులు మనోజ్ కుమార్ కు షోకేస్ నోటీసు జారీ చేశారు. షోకేస్ నోటీసును రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రేమ్ కుమార్ అందించారు.

30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో హోమ్ గార్డ్ చుట్టూ సిట్-అప్లు చేస్తున్న చాలా మంది వ్యక్తులను చూపిస్తుంది. హోమ్ గార్డ్ యొక్క సీనియర్ సిబ్బంది కూడా మీరు ఆఫీసర్ కారును ఎలా ఆపగలరు అనటం మనం ఇక్కడ వీడియోలో వినవచ్చు. జిల్లా వ్యవసాయ అధికారి గణేష్ నుండి క్షమాపణ అడిగాడు. అప్పుడు ఆ హోమ్ గార్డ్ చేతులు ముడుచుకుని, ఆ అధికారి కాళ్ళ ముందు తల వాల్చడం మనం ఇక్కడ గమనించవచ్చు.
ప్రస్తుతం ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది మరియు దీనిపై నివేదికను సిద్ధం చేస్తున్న ఎస్డిపిఓకు తాను అప్పగించినట్లు అరియారియా ఎస్పీ ధురత్ దయాలి సబ్లారామ్ మీడియాతో అన్నారు.

రోడ్లపై విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు మరియు శానిటైజింగ్ బృందాలు కరోనావైరస్ వ్యాప్తిని అదుపులో ఉంచడానికి మొదటి వరుసలో చాలా భాద్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. వారితో ఈ విధంగా వ్యవహరించడం చాలా దారుణమైన చర్య. ఈ ఒక్క సంఘటన మాత్రానే కాకుండా భారతదేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ఈ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం మనం ఇది వరకే గమనించాము. ఏది ఏమైనా కరోనా నివారణలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న వారి పట్ల ఈ విధంగా వ్యవహరించడం హేమమైన చర్య అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications








