Just In
- 12 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 14 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 15 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Movies Om Bheem Bush 7 Days Collection: శ్రీ విష్ణు మూవీకి ఊహించని వసూళ్లు.. వారంలో ఎన్ని కోట్లు వచ్చాయంటే!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి
భారత దేశంలో రోజు రోజుకి ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో పోలీసులు తనికీలు చేయడం మరింత ముమ్మరం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వాహనదారులను పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది ఘరానా దొంగలు కూడా వెలుగులోకి వస్తారు. ఇలాంటి సంఘటనలు మనం ఇది వరకటి కథనాలాలో తెలుసుకుని ఉంటాము. ఇపుడు అదే తరహాలో కొంతమంది నేరస్థులు బయట పడ్డారు.
తాజా సమాచారం ప్రకారం, పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 65 మంది నేరస్థులను అరెస్టు చేసి జైలుకు పంపారు. దాదాపు నాలుగు గంటల ఇంటెన్సివ్ తనిఖీల తరువాత, పోలీసులు దొంగిలించిన కార్లను స్వాధీనం చేసుకున్నారు మరియు క్రిమినల్ నేపథ్యం ఉన్న అనేక మందిని అరెస్టు చేశారు.
చిక్కుకున్న నేరస్థులు మరియు వాహనాల నెంబర్ ని ట్రాక్ చేసే దేశవ్యాప్త నెట్వర్క్ వలె ఇది కనిపిస్తుంది. ఈ తనిఖీలు బీహార్లో జరిగాయి. 4 గంటల తనిఖీలో 65 మందిని అరెస్టు చేసి 67 దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ పోలీసులు చేసిన ఈ ఆపరేషన్ క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న వారిలో భయాందోళనను సృష్టించింది.
MOST READ:ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !
నిందితులు కిడ్నాప్, దోపిడీ వంటి వివిధ కేసులకు పాల్పడ్డారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేర వృత్తికి పాల్పడే వారిని గుర్తించి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇటీవలకాలంలో ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని నిలువరించడానికి పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు.
కేవలం నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ ఆపరేషన్లో పోలీసులు పెద్ద సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్నారా అనే ప్రశ్న తలెత్తింది. పోలీసుల ఈ చర్యను ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు.
MOST READ:నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?
దీనికి సంబంధించిన సమాచారాన్ని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. అక్రమ రవాణా ద్వారా మద్యం బాటిల్స్, 3,570 లీటర్ల మద్యం, 159 కిలోల మందులను స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక తెలిపింది.
ఇవి మాత్రమే కాకుండా రూ. 92000 నగదు కూడా పట్టుకున్నారు. బీహార్లోని 38 జిల్లాల్లో జరిగిన తనికీలలో ఇవన్నీ కనుగొనబడ్డాయి. మన రాష్ట్రాల్లో కూడా ఈ తరహా ఆపరేషన్ చేయాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కారు ఓనల్రు దొంగల వల్ల చాలా ఇబ్బందిపడుతున్నారని తెలుస్తుంది. ఎన్ని లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగించినప్పటికీ వాహన దొంగతనాలను నిలువరించలేకపోతున్నారు.
MOST READ:మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్.. ఇప్పుడు మరింత సూపర్ స్టైల్ గురూ!
ఇటీవల కాలంలో చాలామంది వాహన తయారీదారులు కొత్త టెక్నాలజీలతో ఆటోమొబైల్స్ తయారు చేస్తున్నాయి. దొంగిలించబడిన వాహనాలను ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రానికి అమ్మడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాలలో రోడ్డుపైన సిసిటివిల కొరత ఉంది, మరికొన్ని ప్రాంతాలలో సిసిటివిలు సక్రమంగా నిర్వహించడం లేదు. ఇవన్నీ పోలీసుల పనితీరుపై ఆటంకం కలిగిస్తున్నాయి. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి వాహనాల్లో జిపిఎస్, నావిగేషన్ వాడాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు.
MOST READ:సినిమా స్టైల్లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]
వాహన దొంగతనాలను నివారించడానికి వాహనాలలో వీలైనంత కొత్త టెక్నాలజీలను ఉపయోగించాలి. ఇవన్నీ వాహనాలలో ఉపయోగించినట్లైతే దొంగలించిన తర్వాత సులభంగా గుర్తించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
Note: Images are representative purpose only.