Accident రాంగ్ రూట్ లో వచ్చారు.. బొక్క బోర్లా పడ్డారు.. కెమెరాలో రికార్డైన విజువల్స్
రాంగ్ రూట్ డ్రైవింగ్ భారత దేశంలో ప్రధాన సమస్యగా ఉంది. రాంగ్ రూట్ లో వెళ్తున్న లేదా వస్తున్న వాహనాలు చాలా వరకు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు వార్తల్లో నిత్యం చూస్తున్నాం. ఈ ప్రమాదాల కారణంగా అధిక మొత్తంలో నష్టం వాటిల్లడంతో పాటు ఇతరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన ఓ ప్రమాద వివరాలు మీకోసం..
దేశంలో సీసీటీవీల వినియోగం భారీగా పెరిగింది. అందులో భాగంగా ప్రభుత్వాలు కూడా ప్రమాద జంక్షన్ లలో వీటిని ఏర్పాటు చేసింది. అలానే ఆటోమొబైల్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రమాదాలు డాష్ బోర్డు కెమెరాలో రికార్డు అవుతున్నాయి. మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ప్రమాద ఘటన విజువల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వస్తున్న వ్యక్తి బైక్ నేరుగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఖజురహోలో చోటుచేసుకుంది. నాలుగు లేన్ల హైవేపై ఓ వ్యక్తి మహిళతో కలిసి వస్తుండగ ఈ ప్రమాదం జరిగింది. బైక్ అధిక స్పీడ్ లో ఉండటమే దీనికి ప్రధాన కారణంగా వీడియోలో చూస్తే గమనించవచ్చు. క్షణాల్లో జరిగిపోయిన ఈ సంఘటన అక్కడివారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
నాలుగు లేన్ల రోడ్డుపై రెండు మోటార్సైకిళ్లు వస్తుండగా ఈ ఘటన జరిగింది. అందులో ఒక బైక్ పూర్తి కుడి వైపుకి వెళ్లిపోగా యాక్సిడెంట్ కి గురైన బైక్ నేరుగా వచ్చి కారును ఢీ కొడుతుంది. ప్రమాదానికి ముందు బైక్ ని నిలువరించేందుకు బైక్ చొడకుడు చాలా వరకు ప్రయత్నం చేసినప్పటికీ.. కారు అలానే బైక్ అధిక స్పీడుతో ఉండడంతో ప్రమాదం జరిగింది.
వాహనాన్ని నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండగా, వెనక కూర్చున్న మహిళ హెల్మెట్ ని ధరించలేదు. కారుని ఢీకొట్టిన వెంటనే బైక్ నుంచి కింద పడిన మహిళ రైడర్ దగ్గరకు వెళ్తుంది. అక్కడికి చేరుకుని అతనికి ఏమైనా గాయాలయ్యాయా లేదా అని చెక్ చేస్తుంది. తరువాత, కారు యజమాని వాహనాన్ని రోడ్డు పక్కనే పార్క్ చేసి, ఏమి జరిగిందో చూడటానికి చుట్టూ గుమిగూడిన వ్యక్తులతో మాట్లాడుతున్నట్లు వీడియోలో గమనించవచ్చు.
త్వరగా లక్ష్యానికి చేరుకోవాలని ఆత్రుతలో కొంతమంది ఇలా రాంగ్ రోడ్డులో వెళ్తుంటారు. మరికొందరు ఇంధనాన్ని ఆదా చేసుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ అది వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తుందనీ ఇలా చేసేవారు గమనించాలి. ఎల్లప్పుడూ సరైన లేన్ను అనుసరించడం ముఖ్యం, ముఖ్యంగా హైవేలపై ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు. మీరు తప్పని సరిగా ఆ లేన్ను ఉపయోగించాల్సి వస్తే, ఇతర వాహనాలను వేగంగా అధిగమించడానికి ప్రయత్నించవద్దు.
చాలా సందర్భాలలో హైవేల్లో, ఎక్స్ప్రెస్వే లలో స్థానికుల కోసం సర్వీస్ రోడ్డును కాంట్రాక్టర్లు లేదా అధికారులు వేయరు. అందువల్ల లోకల్ గా ఉండే వారు హైవేలను ఉపయోగించుకుంటారు. అలానే యు-టర్న్లు దూరంగా ఉన్నందున, వారు తమ గమ్యాన్ని చేరుకోవడానికి రాంగ్ రూట్ తీసుకొని దూరాన్ని తగ్గించుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం అని గుర్తుపెట్టుకోవాలి.
భారతదేశంలో రైట్-ఆఫ్-వే అనే భావన ఉనికిలో లేదు. కాబట్టి రహదారిపై భద్రతను నిర్ధారించడానికి క్రాసింగ్ వద్దకు వెళ్లేటప్పుడు వేగాన్ని తగ్గించడం మంచిది. అదనంగా, హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు, పట్టణాలు, గ్రామాల వంటి జనావాస ప్రాంతాలలో ప్రయాణిస్తున్నప్పుడు వేగాన్ని తగ్గించాలని సిఫార్సు చేయబడింది. నియమించబడిన పాదచారుల క్రాసింగ్లు ఉన్నప్పటికీ, సమయాన్ని ఆదా చేయడానికి చాలా మంది వ్యక్తులు హైవేని దాటడాన్ని ఎంచుకుంటారు.
అలానే రోడ్డుపై విచ్చలవిడిగా పశువుల వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. హైవేలపై సురక్షితమైన వేగంలో బైక్ లేదా కారును నడపడం చాలా కీలకం. ప్రత్యేకించి స్థానికులు రోడ్డుపై వెళ్లేప్పుడు రాంగ్ రూట్ లో ప్రయాణించే సంఘటనలు సర్వసాధారణమే అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాల భారీ నుంచి బయటపడవచ్చు.


Click it and Unblock the Notifications








