బైక్ రైడర్కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే
2019 లో అమల్లోకి వచ్చిన కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం దేశంలో ట్రాఫిక్ నిబంధనలు చాలా ఖచ్చితంగా పాటించబడాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించినట్లైతే వాహనదారులకు భారీ మొత్తంలో జరిమానాలు విధించడం జరుగుతుంది. ఇప్పటికే మనం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన కేసులు చాలా చూసాం. కానీ ఇటీవల ఇదే రీతిలో మరో కేసు వెలుగులోకి వచ్చింది.

ఒడిశాలోని మాండ్సౌర్ జిల్లాలో వివిధ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బైక్ రైడర్ కి దాదాపు 1,13,500 రూపాయల జరిమానా విధించారు. ఆటో హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, జిల్లాలోని ప్రధాన రహదారిపై నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనదారుడిని పోలీసులు ఆపారు. బైక్ రైడర్ హెల్మెట్ ధరించలేదు. అంటే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్తో సహా బైక్కు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా లేవు.

ఈ బైక్ రైడర్ తన బైక్పై చిన్న వాటర్ ట్యాంకులను విక్రయించే ఇనుప రాడ్ను కూడా ఏర్పాటు చేసాడు. కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం, హెల్మెట్ ధరించనందుకు బైక్ రైడర్కు రూ. 1000, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ. 5 వేలు, ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల రూ. 2,000, రిజిస్ట్రేషన్ ప్లేట్ లేనందుకు రూ. 5 వేలు జరిమానా విధించారు.

ఇవి మాత్రమే కాకుండా, రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా డీలర్షిప్ వద్ద వాహనం కొనుగోలు చేసినందుకు రూ. 1 లక్ష జరిమానా విధించారు. కొత్త మోటారు వాహన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఒడిశా కూడా ఉంది. మొదట ప్రారంభంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొన్ని నిరసనల కారణంగా కొత్త చట్టం చేయడానికి నిరాకరించారు.

కానీ రాష్ట్రంలో ట్రాఫిక్ వ్యవస్థను పటిష్టం చేయడానికి మరియు వాహన చట్టాలను మెరుగుపరచడానికి కొత్త నిబంధనను అమలులోకి తీసుకువచ్చాడు. రోడ్డు ప్రమాదాల గణాంకాల ప్రకారం, గత ఏడాది సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో ఒడిశాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 2019 సెప్టెంబర్ మరియు అక్టోబర్ తో పోలిస్తే 27.5% పెరిగిందని నివేదికల ద్వారా తెలుస్తుంది.

కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం జరిమానాలను మునుపటికంటే 10 రెట్లు పెంచారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి పాత చట్టం సవరణ తర్వాత రూ. 1,000 నుంచి 10,000 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు.

హెల్మెట్ ధరించకపోతే మీకు రూ. 100 విధించేవారు, కానీ కొత్త చట్టం ఆమోదించిన తర్వాత ఈ మొత్తాన్ని రూ. 1000 కు పెంచారు. ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తరచుగా ఉల్లంఘినట్లైతే, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.

ఇప్పుడు వాహనదారుడు సీట్బెల్ట్ ధరించకపోతే, రూ. 1000, అత్యంత వేగంతో ప్రయాణినించినట్లైతే మునుపు విధిస్తున్న 500 రూపాయల జరిమానాను ఇప్పడు ఏకంగా రూ. 5 వేలు జరిమానా విధించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్ లేకుండా పట్టుబడితే రూ. 10,000 జరిమానా విధిస్తారు. వాహనదారులు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఓం ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్, డిజిలేకర్ యాప్లో తీసుకెళ్లవచ్చు. ఈ యాప్ వాహనదారులకు వారి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి బుక్, వెహికల్ ఇన్సూరెన్స్ మరియు ఎన్ఓసి సంబంధిత డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసి మొబైల్లో ఉంచుకుని, ట్రాఫిక్ పోలీసులకు వీటిని వెరిఫికేషన్ లో చూపించవచ్చు.


Click it and Unblock the Notifications








