Just In
- 2 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 4 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 12 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 18 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
19 సూపర్ బైక్లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్డౌన్ సడలించడం వల్ల ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటికి రావడం ప్రారంభించారు. కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీసులు తమ బైక్లపై స్టంట్ చేస్తున్న దాదాపు 100 మంది బైకర్లను అరెస్టు చేశారు. ఇప్పుడు గురుగ్రామ్ పోలీసులు 19 స్టంట్ రైడర్లకు జరిమానా విధించి బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
చాలా ప్రాంతాలలో ఈ బైక్ రేసులు జరగటం మనం చూస్తూనే ఉంటాము. ఈ రేసులు వల్ల చాల ప్రమాదాలు సంభవిస్తాయి. అంతే కాకుండా వాహనదారులకు మరియు రోడ్డుపై ప్రయాణించే ప్రజలకు కూడా ఇబ్బందులను కలిగిస్తాయి.
గురుగ్రామ్ లోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ తొలగించబడింది. ఈ కారణంగానే బైకర్లు బైక్ల స్టంట్ చేయడం ప్రారంభించారు. లాక్డౌన్ ఓపెన్ చేసిన తరువాత, రైడర్స్ బృందం ఒకటి విన్యాసాలు చేయడానికి పాల్పడ్డారు. బహిరంగ ప్రదేశాలలో ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడినందుకు వారికి జరిమానా విధించబడింది.
MOST READ:బిఎస్ 6 బజాజ్ సిటి 100 కొత్త ధరలు & ఇతర వివరాలు
గురుగ్రామ్ యొక్క డిసిపి రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనదారులు నివ్వెరపోయారు. డీసీపీ వెంటనే పోలీసు సిబ్బందిని అక్కడికి పంపించారు. ఈ బైక్లను స్వాధీనం చేసుకోవడంలో డీసీపీ నాయకత్వం వహించారు.
ఇందులో చాలా బైక్లు ఖరీదైనవే. చాలా బైక్లు సుజుకి హయాబుసా బైక్లు. మోటారు వాహన చట్టం 2019 ప్రకారం పోలీసులు రూ. 17,000 జరిమానా విధించారు. కోర్టు విచారణ పూర్తయ్యే వరకు మొత్తం 19 బైక్లను పోలీసుల అధీనంలో ఉంటాయి.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : పాకిస్థాన్లో తలెత్తిన కొత్త సమస్య
గురుగ్రామ్లోని సెక్టార్ 53 పోలీస్ స్టేషన్ వారు ఈ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు గణనీయంగా పెరిగాయని పోలీసులు తెలిపారు. లాక్డౌన్ సమయంలో రోడ్లు ఖాళీగా ఉన్నందున కొంతమంది బైక్ రైడర్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇది రోడ్డుపై ప్రయాణించే ప్రజలకు భయాన్ని కలిగిస్తుంది.
ఈ బైక్లన్నీ గోల్ఫ్ కోర్సు రహదారి నుండి జప్తు చేయబడ్డాయి. ప్రతి బైక్ ధర దాదాపు రూ. 6 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. బైక్ రైడర్స్ గోల్ఫ్ కోర్సు రహదారి చుట్టూ ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తారు. ఈ ఖరీదైన బైకులన్నీ గురుగ్రామ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
MOST READ:2021 ఫార్చ్యూనర్ ఫేస్లిఫ్ట్ ఉపకరణాలను వెల్లడించిన టయోటా