Just In
- 9 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 9 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 10 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 12 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కోడి వ్యర్థాల నుంచి బయోడీజిల్.. లీటరుకి 38 కి.మీ మైలేజ్, ధర కూడా చాలా తక్కువ
వాహనదారులందరికి సాధారణంగా డీజిల్ మరియు పెట్రోల్ గురించి ఎక్కువ తెలుసు. అయితే బయో డీజిల్ వంటి వాటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. బయో డీజిల్ అనేది వివిధ రకాలుగా ఉత్పత్తి చేస్తారన్న సంగతి తెలిసిన విషయమే, అయితే దాదాపు ఏడు సంవత్సరాల నిరీక్షణ తరువాత, కేరళ వెటర్నరీ డాక్టర్ 'జాన్ అబ్రహం' పౌల్ట్రీ వ్యర్థాల నుండి బయో డీజిల్ తయారు చేసి దానిపై పేటెంట్ కూడా కైవసం చేసుకున్నాడు.
జాన్ అబ్రహం తయారు చేసిన ఈ బయో డీజిల్ లీటరుకు ఏకంగా 38 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని తెలిపాడు. బయో డీజిల్ సాధారణ డీజిల్ కంటే 40% తక్కువ ధరకు లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఈ బయో డీజిల్ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందని కూడా అంటారు.
ఏడు సంవత్సరాల నిరంతర కృషి తరువాత పౌల్ట్రీ వ్యర్థాల నుండి బయో డీజిల్ ఉత్పత్తి చేయడానికి ఇండియన్ పేటెంట్ కార్యాలయం పేటెంట్ జారీ చేసింది. ఈ నెల జూలై 7 న పేటెంట్ జారీ చేశారు. ఈ బయోడీజిల్ను కేరళ వెటర్నరీ మెడికల్ యూనివర్శిటీలోని వయనాడ్ వెటర్నరీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ జాన్ అబ్రహం కనుగొన్నారు.
ఈ ఆవిష్కరణ తమిళనాడు వెటర్నరీ విశ్వవిద్యాలయంలోని నామక్కల్ యొక్క వెటర్నరీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ తో అనుసంధానించబడి ఉండటం గమనార్హం. జాన్ అబ్రహం 2009 నుంచి 2012 వరకు చేసిన పరిశోధన ఫలితంగా ఈ బయోడీజిల్ తయారైంది.
ఈ పరిశోధన కోర్సు తరువాత, కేరళలోని వయనాడ్ లోని వెటర్నరీ మెడిసిన్ కాలేజీలో చేరాడు. దీని ఆధారంగా భారత్ పెట్రోలియం కొచ్చి డివిజన్ ఈ బయో డీజిల్ ధృవీకరణ పత్రాన్ని ప్రదానం చేసింది. అప్పుడు ఈ బయోడీజిల్ ద్వారా కాలేజీ వాహనం నడపబడింది.
జాన్ అబ్రహం మరియు అతని ముగ్గురు విద్యార్థులు ఇప్పుడు పంది వ్యర్థాల నుండి బయోడీజిల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. బయోడీజిల్ ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. బయో డీజిల్ శాకాహార నూనె వాసన కలిగి ఉంది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు అమ్మకానికి ఉన్న డీజిల్ లాగా కనిపిస్తోందని జాన్ అబ్రహం చెప్పారు.
అతి తక్కువ ధరకే లభించే ఈ బయో డీజిల్ వాహనాల యొక్క మైలేజ్ పెంచడంలో ఉంపయోగపడుతుంది. కావున ఇప్పుడు అధిక ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులు ఎంతగానో సంతోషపడుతున్నారు. ఈ బయో డీజిల్ వల్ల వాతారవరణంలోకి ఎలాంటి కర్బన పదార్థాలు వెలువడవు. కావున వాతావరణ కాలుష్యం కూడా జరిగే ప్రమాదం లేదు.
భారతదేశంలో డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి మరియు చాలా రాష్ట్రాల్లో లీటరుకు డీజిల్ ధర ఇప్పుడు 100 రూపాయలు దాటేసింది. భారతదేశ ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి బయో డీజిల్ సహాయం చేస్తుంది.
భారతదేశంలో ముడి చమురు దిగుమతుల పరిమాణాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో ఎలక్ట్రిక్ వాహనాలు, సిఎన్జి వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ బయో డీజిల్ వినియోగంలోకి వస్తే వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.