Just In
- 10 hrs ago ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- 11 hrs ago పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!
- 12 hrs ago ఈ కార్లు సేఫ్టీలో జీరో.. సేల్స్లో టాప్.. అయినా జనాలు వీటినే ఎందుకు కొంటున్నారు?
- 12 hrs ago మొదలైన Hero Mavrick 440 బైక్ డెలివరీస్.. బుక్ చేసుకున్న వారికి పండగే!
Don't Miss
- News కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Movies Devara Business దేవర ప్రీ రిలీజ్ బిజినెస్తో మైండ్ బ్లాక్..NTR కెరీర్లోనే హయ్యెస్ట్గా! ఎన్ని కోట్లంటే?
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
మృదువైన పక్షి ఢీ కొంటె పతనమవుతున్న విమానాలు: దీని వెనకున్న అసలు మర్మం ఏమిటి?
కేవలం
ఒక
చిన్న
పక్షి
ఢీ
కొనడం
వలన
పెద్ద
పెద్ద
విమానాలు
కూలిపోతున్నాయి
ఎందుకు?
ఇది
మనందరికి
ఒక
సాధారణ
ప్రశ్నగా
ఉండవచ్చు.
అవును
చిన్న
పక్షుల
ఢీ
కొనడం
వలన
కూలిపోయిన
విమానాలు
ఎన్నో
ఉన్నాయి.
దీని
వెనకున్న
అసలు
కారణాలేంటి?
మరింత
చదవండి:
మిత్సుబిషి
నుండి
మొదటి
ప్యాసింజర్
జెట్
ప్లేన్
ఆకాశ
మార్గాన
ఎగురుతున్న
పక్షుల
గుంపును
ఎప్పుడైన
చూశారా?
ఎంత
అందంగా
ఉంటాయి
కదా.
కాని
ఈ
పక్షుల
గుంపులు
పెద్ద
విమానాలను
చుట్టుముట్టిన
తీరును
చూశారా?
మానవ
ప్రయత్నం
లేకుండా
జరిగిన
ఈ
చర్యలలో
జరిగిన
ప్రమాదాలు
కూడా
చాలానే
ఉన్నాయి.
పక్షులకు,
విమానాలకు
మద్య
గల
మరిన్ని
విశేషాలు
క్రింది
కథనాల
ద్వారా
తెలుసుకుందాం
రండి.
రోడ్ల మీద గల ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని మానవ అవసరాలకు మన సృష్టించుకున్న ఈ సాధనం మనకు ఎంతో ఉపయోగపడింది. కాని ఈ విమానాల వలన ఎన్నో పక్షులు వీటిని ఢీ కొని మరణిస్తున్నాయి.
దాదాపుగా ఎక్కువ విమాన ప్రమాదాలకు పక్షులే ముఖ్య కారణం అని విమాన తయారీ నిపుణులు చెబుతున్నారు. అందుకోసం చాలా విమాన తయారీ సంస్థలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ఆధునిక పద్దతులను అనుసరిస్తున్నారు. పక్షుల ద్వారా జరిగిన ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
ఈ ఆధునిక కాలంలో కూడా పక్షుల భారిన పడి విమానాలు ప్రమాదాలకు గురైతే ఇక మానవ అభివృద్ది ఎక్కడుందని కొందరు అంటున్నారు. అయితే విమాన భద్రత విషయంలో ముఖ్యంగా మార్పు రావాల్సింది పక్షుల ద్వారా జరిగే ప్రమాదాలను అరికట్టడంలో.
ఈ ప్రమాదాలు ఎక్కువగా, విమానం కదులుతున్నసందర్భంలో రెక్కలకు పక్షులు తగులుతాయి. దీని వలన ఇంజన్ ప్రవేశ ద్వారాలలో సాంకేతిక లోపం తలెత్తి ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి.
పక్షులు ఎక్కువగా ఢీ కొట్టే సందర్బాలు టేకాఫ్ మరియు ల్యాండింగ్. ఈ రెండు సందర్భాలలో ఎత్తులో కనుక భారీ వ్యత్యాసాలు ఉంటే ఈ ప్రమాదాలు జరుగుతాయి. మరియు సముద్రాల మీద దాదాపుగా 6000 నుండి 9000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్నపుడు పక్షుల కాణంగానే విమానాలు కూలిపోయినట్లు రికార్డులు చెపుతున్నాయి.
ఒక పక్షి దాదాపుగా 11,300 మీటర్లు ఎత్తులో ఉన్న విమానంతో పోటి పడి ఎగిరింది. ఐవరీ కోస్ట్ రప్పెల్ అను రాబందు ఆ విమానంతో తాకిడి కారణంగా పెను ప్రమాదాన్ని సృష్టించింది. అయితే 90 శాతం వరకు ప్రమాదాలు విమానాశ్రయంలో సంభవిస్తాయని నివేదికలు చెపుతున్నాయి.
అయితే ఈ ప్రమాదాలను భౌతిక శాస్త్ర సిద్దాంతాల ప్రకారం తెలుసుకోవాలని ప్రయత్నించినపుడు. పక్షులు విమానాలతో పోటిగా ప్రయానిస్తున్నాయని కొన్ని సందర్బాల్లో తెలిసింది.కాని విమానాన్ని గంటకు 275 కిలోమీటర్ల వేగంతో నడిపినపుడు ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు లేవు.
ఈ సందర్భాల్లో జెట్ ఇంజన్లో గల బ్లేడ్లు నిమిషానికి 3,000 నుండి 4,000 చుట్లు తిరుగుతుంది. మరియు దీనిని ఆపేసే ముందు కూడా దాదాపుగా 1,000 సార్లు తిరుగుతేుంది. విమానం గాలిలో మలుపులు తీసుకుంటున్న సంధర్బాల్లో పక్షులు ఈ టర్బైన్ ఇంజన్లోకి ఆకస్మాత్తుగా దూసుకెళ్లి నిప్ప రవ్వలు మొదలై అగ్ని ప్రమాదం జరిగి విమానాలు కూలిపోయే అవకాశం ఉంది
దాదాపుగా ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతంటాయి. కాని విమానం గాలిలో ఉన్నప్పుడు ఇవి కనుక ఎదురుపడితే ఆ క్షణాలు ఎంతో కష్టాన్ని సృష్టస్తాయని తెలిపారు. అయితే ఏవియేషన్ సేఫ్టి నెట్వర్క్ వారి గణాంకాల ప్రకారం 1955 నుండు 2007 వరకు పక్షి ఢీ కొట్టడం వలన రికార్డు అయిన కేసులు 51 గా నమోదు అయ్యాయని తెలిపారు.
మరో వైపు, అంతర్జాతీయ పక్షి తాకిడిల ప్రమాద కమిటీ వారి నివేదికల ప్రకారం 1959 నుండి 1999 వరకు 286 శాతం పక్షుల కారణంగా విమాన ప్రమాదాలు సంభవించాయని తెలిపారు. రక్షణ రంగంలో ఇవి ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
ఆధునిక జెట్ విమానం ఈ పక్షుల వెంబడింపును అరికట్టడానికి పక్షులకు నచ్చని ఒక రసాయినాన్ని విమానం వెనుక నుండి విడుదల చేస్తారు. దీని వలన పక్షులు విమానాలతో పోటి పడి ప్రయాణించే పరిస్థితిని అరికట్టవచ్చు. అయితే భారీ స్థాయిలో గల వీటిని నివారించడం కాస్త కస్టమే.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిష్ట్రేషన్ వారి కథనం ప్రకారం పక్షులు విమానాలను ఢీ కొట్టడం వలన అమెరికా లోని ఎయిర్ లైన్స్ సంస్థలు దాదాపుగా 4000 మిలియన్ అమెరికన్ డాలర్లు నష్టపోయినట్లు తెలిపారు. మరియు 1988 లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 200 మంది వరకు మరణాలకు ఆ పక్షి ప్రమాదాలు కారణం అని తెలిపారు.
1905 లో రైట్ బ్రదర్స్ విమానం లో ప్రయాణిస్తుండగా మొదటి సారిగా ఈ పక్షి ప్రమాదాన్ని చవి చూశారు.
వీడియో
పక్షి కారణంగా ప్రమాదంలో పడిన విమానాన్ని ప్రక్కన గల వీడియో ద్వారా వీక్షించండి.