అంబులెన్సుకి దారి ఇవ్వడానికి నిరాకరించిన బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్! ఇంతకీ ఎం జరిగిందంటే...?

భారతదేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి పార్టీ పచ్చిమబెంగాల్ లో ఒక ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీకి ప్రముఖ బిజెపి నాయకులు హాజరయ్యారు. ఈ సమయంలో ఆ ప్రదేశంలోకి వచ్చిన అంబులెన్సుకి దారి ఇవ్వడానికి నాయకులు నిరాకరించారు.ఎందుకు నిరాకరించారు అనే విషయాన్ని గురించి మనం మరింత తెలుసుకుందాం!

అంబులెన్సుకి దారి ఇవ్వడానికి నిరాకరించిన బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్! ఇంతకీ ఎం జరిగిందంటే...?

పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో బిజెపి పార్టీ తరపున ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్ హాజరయ్యారు. ర్యాలీ జరుగుతున్న సమయంలో పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు చాలా మంది రోడ్లపైనే ఉన్నారు. ఈ ర్యాలీ వెంట ఒక అంబులెన్సు వచ్చింది. సాధారణంగా ఎంతటి వారైనా అంబులెన్సుకి దారి ఇవ్వలసిందే కానీ బిజెపి నాయకుడైన దిలీప్ ఘోష్ ఆ అంబులెన్సు కి దారి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విధంగా నిరాకరించడం వల్ల ఇది కొంత వివాదానికి దారి తీసింది.

అంబులెన్సుకి దారి ఇవ్వడానికి నిరాకరించిన బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్! ఇంతకీ ఎం జరిగిందంటే...?

ర్యాలీ జరిగే ప్రదేశంలోకి వచ్చిన అంబులెన్సుని తిరిగి వేరే మార్గంలో వెళ్ళమని దిలీప్ ఘోష్ చెప్పినట్లు సమాచారం. కార్యకర్తలందరు ఇక్కడ కూర్చున్నారు, అంబులెన్స్ వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయని, ఏదో ఒక మార్గాన్ని చూసుకుని వెళ్ళమని చెప్పారు. ర్యాలీ జరిగే ప్రాంతం యొక్క వెనుక గేట్ నుండి వెళ్ళమని చెప్పండి అని దిలీప్ ఘోష్ చెప్పారు.

అంబులెన్సుకి దారి ఇవ్వడానికి నిరాకరించిన బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్! ఇంతకీ ఎం జరిగిందంటే...?

ర్యాలీ జరిగే ప్రాంతంలో చాలా మంది కార్యకర్తలు కూర్చున్నారని, ఈ మార్గం గుండా అంబులెన్స్ వెళ్తే వారు ఇబ్బంది పడతారు అని చెప్పారు. కాబట్టి వేరే మార్గం నుండి వెళ్ళమని చెప్పినట్లు మనకు సమాచారం.

అంబులెన్సుకి దారి ఇవ్వడానికి నిరాకరించిన బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్! ఇంతకీ ఎం జరిగిందంటే...?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే కారణమని ఆరోపించారు. మమతా బెనర్జీ మాటాడుతూ చాలా ప్రదేశాలు ఉన్నప్పుడు ఈ ప్రాంతం గుండా ఎందుకు వస్తున్నాయనన్నారు, ర్యాలీలో చాలా మంది కూర్చున్నప్పుడు ఆంబులెన్స్ వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది అన్నారు.

అంబులెన్సుకి దారి ఇవ్వడానికి నిరాకరించిన బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్! ఇంతకీ ఎం జరిగిందంటే...?

ఈ ర్యాలీలో దిలీప్ ఘోష్ జెఎన్‌యు గురించి మాటాడుతూ ఇక్కడ ఒక విద్యారి అయిన ఐషి ఘోష్ దాడి గురించి చెప్పారు. ఇతను విలేకరులతో మాటాడుతూ ఒక వ్యక్తి తాను గాయమైనట్లు ఫోటోలు ప్రతి చోట వ్యాపించాయి అన్నారు. ఇది నిజంగా తలకు గాయమైందా లేదా అని తెలియదు. ఒక వేళా ఇది నకిలీ కాకపోతే వారు అంబులెన్స్ నుండి ఎలా దిగిపోతారు అని చెప్పారు.

అంబులెన్సుకి దారి ఇవ్వడానికి నిరాకరించిన బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్! ఇంతకీ ఎం జరిగిందంటే...?

జెఎన్‌యు దాడిని నిరసిస్తూ దుర్గాపూర్ లో జరిగిన ర్యాలీలో ఐషి ఘోష్ తల్లి మాట్లాడుతూ, దిలీప్ ఘోష్ వంటి నాయకులూ ఈ విధంగా అవమానకరంగా మాటాడటం దురదృష్టకరం అని చెప్పింది. తన బిడ్డ గాయాలు నిజమైనవేనా లేక నకిలీవా అని ప్రశ్నించడం కొంత భాధాకరం అన్నారు.

అంబులెన్సుకి దారి ఇవ్వడానికి నిరాకరించిన బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్! ఇంతకీ ఎం జరిగిందంటే...?

భారీగా జరుగుతున్న ఈ ర్యాలీలో జరిగిన ఈ సంఘటనల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ర్యాలీలో చాలా ఎక్కువమంది ఉండటం వల్ల అంబులెన్స్ ని వేరే మార్గంలో వెళ్లాలని చెప్పినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇది కొంత వివాదానికి దారి తీసింది అని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, January 10, 2020, 13:51 [IST]
English summary
Tell us to go the other way-Read in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+