Just In
- 1 hr ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 2 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 15 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 19 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
Don't Miss
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
అంబులెన్సుకి దారి ఇవ్వడానికి నిరాకరించిన బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్! ఇంతకీ ఎం జరిగిందంటే...?
భారతదేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి పార్టీ పచ్చిమబెంగాల్ లో ఒక ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీకి ప్రముఖ బిజెపి నాయకులు హాజరయ్యారు. ఈ సమయంలో ఆ ప్రదేశంలోకి వచ్చిన అంబులెన్సుకి దారి ఇవ్వడానికి నాయకులు నిరాకరించారు.ఎందుకు నిరాకరించారు అనే విషయాన్ని గురించి మనం మరింత తెలుసుకుందాం!
పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో బిజెపి పార్టీ తరపున ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్ హాజరయ్యారు. ర్యాలీ జరుగుతున్న సమయంలో పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు చాలా మంది రోడ్లపైనే ఉన్నారు. ఈ ర్యాలీ వెంట ఒక అంబులెన్సు వచ్చింది. సాధారణంగా ఎంతటి వారైనా అంబులెన్సుకి దారి ఇవ్వలసిందే కానీ బిజెపి నాయకుడైన దిలీప్ ఘోష్ ఆ అంబులెన్సు కి దారి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విధంగా నిరాకరించడం వల్ల ఇది కొంత వివాదానికి దారి తీసింది.
ర్యాలీ జరిగే ప్రదేశంలోకి వచ్చిన అంబులెన్సుని తిరిగి వేరే మార్గంలో వెళ్ళమని దిలీప్ ఘోష్ చెప్పినట్లు సమాచారం. కార్యకర్తలందరు ఇక్కడ కూర్చున్నారు, అంబులెన్స్ వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయని, ఏదో ఒక మార్గాన్ని చూసుకుని వెళ్ళమని చెప్పారు. ర్యాలీ జరిగే ప్రాంతం యొక్క వెనుక గేట్ నుండి వెళ్ళమని చెప్పండి అని దిలీప్ ఘోష్ చెప్పారు.
ర్యాలీ జరిగే ప్రాంతంలో చాలా మంది కార్యకర్తలు కూర్చున్నారని, ఈ మార్గం గుండా అంబులెన్స్ వెళ్తే వారు ఇబ్బంది పడతారు అని చెప్పారు. కాబట్టి వేరే మార్గం నుండి వెళ్ళమని చెప్పినట్లు మనకు సమాచారం.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే కారణమని ఆరోపించారు. మమతా బెనర్జీ మాటాడుతూ చాలా ప్రదేశాలు ఉన్నప్పుడు ఈ ప్రాంతం గుండా ఎందుకు వస్తున్నాయనన్నారు, ర్యాలీలో చాలా మంది కూర్చున్నప్పుడు ఆంబులెన్స్ వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది అన్నారు.
ఈ ర్యాలీలో దిలీప్ ఘోష్ జెఎన్యు గురించి మాటాడుతూ ఇక్కడ ఒక విద్యారి అయిన ఐషి ఘోష్ దాడి గురించి చెప్పారు. ఇతను విలేకరులతో మాటాడుతూ ఒక వ్యక్తి తాను గాయమైనట్లు ఫోటోలు ప్రతి చోట వ్యాపించాయి అన్నారు. ఇది నిజంగా తలకు గాయమైందా లేదా అని తెలియదు. ఒక వేళా ఇది నకిలీ కాకపోతే వారు అంబులెన్స్ నుండి ఎలా దిగిపోతారు అని చెప్పారు.
జెఎన్యు దాడిని నిరసిస్తూ దుర్గాపూర్ లో జరిగిన ర్యాలీలో ఐషి ఘోష్ తల్లి మాట్లాడుతూ, దిలీప్ ఘోష్ వంటి నాయకులూ ఈ విధంగా అవమానకరంగా మాటాడటం దురదృష్టకరం అని చెప్పింది. తన బిడ్డ గాయాలు నిజమైనవేనా లేక నకిలీవా అని ప్రశ్నించడం కొంత భాధాకరం అన్నారు.
భారీగా జరుగుతున్న ఈ ర్యాలీలో జరిగిన ఈ సంఘటనల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ర్యాలీలో చాలా ఎక్కువమంది ఉండటం వల్ల అంబులెన్స్ ని వేరే మార్గంలో వెళ్లాలని చెప్పినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇది కొంత వివాదానికి దారి తీసింది అని చెప్పవచ్చు.