Just In
- 34 min ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 14 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 16 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 17 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్
భారతదేశంలో కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కరోనా మొదటి దశ కంటే చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు ఈ కరోనా భారిన పడి ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణిస్తున్నారు. అది మాత్రమే కాదు రోజురోజుకి లెక్కకు మించి ఈ వైరస్ ప్రభావానికి గురవుతున్నారు.
ఈ సమయంలో దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి పెద్ద కంపెనీలు సైతం కరోనా నివారణ కోసం పాటుపడుతున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా ఆక్సిజన్ అందించడానికి ముందుకు వచ్చాయి. అంతే కాకుండా ఇటీవల మహీంద్రా & మహీంద్రా కంపెనీ మహారాష్ట్రలో ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది.
కొంతమంది వాహన తయారీదారులు ఇటీవల ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి పూనుకున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ అనేది కరోనా వైరస్ ప్రభావానికి గురైన రోగులకు చాలా అవసరం. కావున ఆక్సిజన్ అందించడానికి కంపెనీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.
MOST READ:రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం
ఇదిలా ఉండగా ప్రముఖ క్యాబ్ కంపెనీ బ్లూస్మార్ట్ ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలకు కొన్ని ప్రత్యేక సేవలనందించడానికి ముందుకు వచ్చింది. బ్లూస్మార్ట్ ఇప్పుడు దేశంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు 50% తగ్గింపును అందిస్తామని తెలిపింది.
కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో ఆరోగ్య కార్యకర్తలు ముందంజలో ఉన్నారు. ఇందుకోసం ఆరోగ్య కార్యకర్తలందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఇలాంటి సేవలందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు బ్లూస్మార్ట్ ఈ సేవను అందించడానికి ముందుకు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం.
MOST READ:స్వామీజీని తాకిన పేస్ మాస్క్ ఎఫెక్ట్.. ఎలా అనుకుంటున్నారా?
ఈ ఆరోగ్య కార్యకర్తలలో డాక్టర్స్, మెడికల్ స్తూడెంట్స్ మరియు పారామెడికల్స్ వంటివారు ఉన్నారు. వీరందరికీ బ్లూస్మార్ట్ 50% తగ్గింపును అందిస్తుంది. కావున పైన తెలిపిన ఆరోగ్య కార్యకర్తలందరూ ఈ సర్వీస్ వినియోగించుకోవచ్చు.
గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న బ్లూస్మార్ట్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్లూస్మార్ట్ కంపెనీ ఉపయోగించే రెంటెడ్ వాహనాల్లో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ప్రస్తుతం చాలా ఉపయోగాలున్నాయి.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే
బ్లూస్మార్ట్ కంపెనీ పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తోంది. తన ప్రత్యేకమైన సర్వీస్ ద్వారా ప్రాచుర్యం పొందిన ఈ సంస్థ ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలకు డిస్కౌంట్ వంటి సర్వీసులను అందిస్తుండటం ప్రశంసనీయం.
బ్లూస్మార్ట్ వంటి కొన్ని సంస్థలు ఆరోగ్య నిపుణులకు ప్రత్యేకమైన సేవలను అందిస్తున్నాయి. జెన్సోల్ గ్రూపులో భాగమైన జెన్సోల్ మొబిలిటీ 2019 లో ఢిల్లీలో బ్లూస్మార్ట్ పేరుతో భారతదేశ తొలి 100% స్మార్ట్ ఎలక్ట్రిక్ క్యాబ్లను విడుదల చేయనుంది.
MOST READ:మీకు తెలుసా.. విమానం ఎత్తులో ఎగిరేటపుడు పైలెట్స్ మాట్లాడకూడదు.. ఎందుకంటే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువవుతున్నాయి. అయితే ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని అక్కడ ప్రభుత్వం కూడా ప్రజలను ప్రోత్సహిస్తోంది.ఈ కారణంగా ఎక్కువమంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు.