Just In
- 9 min ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 2 hrs ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 15 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 17 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
Don't Miss
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లాక్డౌన్ ఉల్లంఘించి డ్రగ్స్ కోసం 100 కి.మీ ప్రయాణించిన యువకునికి ఏం జరిగిందంటే ?
భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమిస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా మార్చి 24 నుంచి దాదాపు 45 రోజులకు పైగా లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో లాక్ డౌన్ ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ పరిస్థితి మెరుగుపడకపోతే, లాక్ డౌన్ తిరిగి కొనసాగే అవకాశం ఉంది.
కరోనా లాక్ డౌన్ కారణంగా కరోనా మహమ్మారిని నివారించడానికి భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా అనవసరంగా బయట తిరిగే వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు. ఈ సమయంలోనే ఒక యువకుడు తన బిఎమ్డబ్ల్యూ లగ్జరీ కారులో కొకైన్ కొనడానికి సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాడు.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. లాక్ డౌన్ కారణంగా దేశంలోని చాలా రోడ్లు ఖాళీగా వున్నాయి. జాతీయ రహదారులపై మరియు ప్రధాన నగరాల రోడ్లపై వాహనాల రాకపోకలు ఆగిపోయాయి.
MOST READ:విమానాల బుకింగ్స్ కోసం కొత్త మిషన్ స్టార్ట్ చేసిన ఎయిర్ ఇండియా, ఏంటో తెలుసా..?
రోడ్లు వాహనాల రాకపోకలు ఆగిపోవడంతో కొంతమంది ఈ సమయంలో జాలీ రైడ్ చేయడానికి అవకాశంగా ఉపయోగిస్తున్నారు. ఇది లాక్ డౌన్ యొక్క ప్రయోజనానికి పూర్తిగా వ్యతిరేఖంగా మారుతోంది. కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ సంఘటనలో ఒక యువకుడు బిఎండబ్ల్యు ఎక్స్ 7 ఎక్స్ట్రీమ్ 40 I-M స్పోర్ట్స్ కారును నడుపుతున్నాడు. ఈ కారు ధర దాదాపు రూ. 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. ఆ యువకుడు నోయిడా నుంచి డ్రగ్స్ కొనడానికి బయలుదేరాడు.
MOST READ:ఇప్పుడు బిఎస్ 6 హోండా డియో మరింత కాస్ట్లీ, ఎంతో తెలుసా..?
మీరట్ వెళ్లే దారిలో బెకుంబుల్ చౌక్ వద్ద ఓ యువకుడిని పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో అతను డ్రగ్స్ కొనడానికి 100 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిసింది.
పోలీసుల విచారణలో ఆ యువకుడు నోయిడాకు చెందిన వ్యాపారవేత్త కొడుకుగా గుర్తించారు. లాక్ డౌన్ ఉల్లంఘించిన ఆ యువకునికి జరిమానా విధించారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుంటున్నారు.
MOST READ:లాక్డౌన్లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?
కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై విచారణ జరుగుతుంది. కానీ ఈ సంఘటనలో యువకుడికి జరిమానా విధించబడింది. పోలీసులు ఆ యువకుడిని అప్రమత్తం చేసి వెనక్కి పంపించారు. ఉత్తరప్రదేశ్ ప్రక్కనే ఉన్న ఢిల్లీలో విస్తృతంగా కరోనా వైరస్ సంక్రమణ నేపథ్యంలో పూర్తిగా లాక్ డౌన్ అమలు చేయబడింది.
భారతదేశంలో కరోనా అధికంగా వ్యాపిస్తున్న కారణంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న కారణంగా ప్రజలు కూడా తమ వంతు మద్దతు ప్రకటించాలి.