Just In
- 1 hr ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 2 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 3 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 4 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
Don't Miss
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Movies Prince yawar: ప్రిన్స్ యావర్కు హ్యాండిచ్చిన నయని పావని.. స్టేజీమీదే కన్నీరు పెట్టుకున్న కుర్రాడు!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లాక్డౌన్ ఉల్లంఘించి డ్రగ్స్ కోసం 100 కి.మీ ప్రయాణించిన యువకునికి ఏం జరిగిందంటే ?
భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమిస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా మార్చి 24 నుంచి దాదాపు 45 రోజులకు పైగా లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో లాక్ డౌన్ ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ పరిస్థితి మెరుగుపడకపోతే, లాక్ డౌన్ తిరిగి కొనసాగే అవకాశం ఉంది.
కరోనా లాక్ డౌన్ కారణంగా కరోనా మహమ్మారిని నివారించడానికి భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా అనవసరంగా బయట తిరిగే వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు. ఈ సమయంలోనే ఒక యువకుడు తన బిఎమ్డబ్ల్యూ లగ్జరీ కారులో కొకైన్ కొనడానికి సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాడు.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. లాక్ డౌన్ కారణంగా దేశంలోని చాలా రోడ్లు ఖాళీగా వున్నాయి. జాతీయ రహదారులపై మరియు ప్రధాన నగరాల రోడ్లపై వాహనాల రాకపోకలు ఆగిపోయాయి.
MOST READ:విమానాల బుకింగ్స్ కోసం కొత్త మిషన్ స్టార్ట్ చేసిన ఎయిర్ ఇండియా, ఏంటో తెలుసా..?
రోడ్లు వాహనాల రాకపోకలు ఆగిపోవడంతో కొంతమంది ఈ సమయంలో జాలీ రైడ్ చేయడానికి అవకాశంగా ఉపయోగిస్తున్నారు. ఇది లాక్ డౌన్ యొక్క ప్రయోజనానికి పూర్తిగా వ్యతిరేఖంగా మారుతోంది. కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ సంఘటనలో ఒక యువకుడు బిఎండబ్ల్యు ఎక్స్ 7 ఎక్స్ట్రీమ్ 40 I-M స్పోర్ట్స్ కారును నడుపుతున్నాడు. ఈ కారు ధర దాదాపు రూ. 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. ఆ యువకుడు నోయిడా నుంచి డ్రగ్స్ కొనడానికి బయలుదేరాడు.
MOST READ:ఇప్పుడు బిఎస్ 6 హోండా డియో మరింత కాస్ట్లీ, ఎంతో తెలుసా..?
మీరట్ వెళ్లే దారిలో బెకుంబుల్ చౌక్ వద్ద ఓ యువకుడిని పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో అతను డ్రగ్స్ కొనడానికి 100 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిసింది.
పోలీసుల విచారణలో ఆ యువకుడు నోయిడాకు చెందిన వ్యాపారవేత్త కొడుకుగా గుర్తించారు. లాక్ డౌన్ ఉల్లంఘించిన ఆ యువకునికి జరిమానా విధించారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుంటున్నారు.
MOST READ:లాక్డౌన్లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?
కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై విచారణ జరుగుతుంది. కానీ ఈ సంఘటనలో యువకుడికి జరిమానా విధించబడింది. పోలీసులు ఆ యువకుడిని అప్రమత్తం చేసి వెనక్కి పంపించారు. ఉత్తరప్రదేశ్ ప్రక్కనే ఉన్న ఢిల్లీలో విస్తృతంగా కరోనా వైరస్ సంక్రమణ నేపథ్యంలో పూర్తిగా లాక్ డౌన్ అమలు చేయబడింది.
భారతదేశంలో కరోనా అధికంగా వ్యాపిస్తున్న కారణంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న కారణంగా ప్రజలు కూడా తమ వంతు మద్దతు ప్రకటించాలి.