కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ. 70 లక్షల భీమా; బాష్

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. ఈ విధంగా మరణిస్తున్న వారికి అండగా ఉండటానికి వాహన విడిభాగాల తయారీసంస్థ బాష్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రకటించింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణించినట్లతే మాత్రం ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది.

కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ. 70 లక్షల భీమా; బాష్

కరోనా మహమ్మారి వల్ల ఏవరైనా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మరణించినట్లతే 70 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా, ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కంపెనీ తగిన పరిష్కార చర్యలు తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీనితోపాటు కంపెనీ ఉద్యోగులు మరణిస్తే తన కుటుంబానికి మూడేళ్లపాటు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అందుతుందని కంపెనీ తెలిపింది.

కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ. 70 లక్షల భీమా; బాష్

కరోనా వైరస్ సంక్రమించడం వల్ల రోగులు శ్వాశకోశ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో కంపెనీ ఆక్సిజన్ మరియు ఇతర వైద్య పరికరాలను బెంగళూరు మరియు పూణే క్యాంపస్‌లలో అందిస్తూ కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

MOST READ:మతిపోగొడుతున్న మాడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ; వివరాలు

కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ. 70 లక్షల భీమా; బాష్

అంతే కాకుండా ప్రస్తుతం దేశంలో కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల, ప్రజలకు ఆక్సిజన్ అందించడానికి ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారంలో కూడా పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. కోవిడ్ 19 వల్ల కలిగే కష్టాల సమయంలో ఈ తయారీ యూనిట్లు సమాజానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి.

కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ. 70 లక్షల భీమా; బాష్

ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రజలకు తహమా వంతు సాయం చేయడానికి కంపెనీ ముందడుగులు వేస్తోంది. అంతే కాకుండా ప్రజలు కూడా ఒకరికొకరు సహకరించుకుని, సంఘీభావం తెలుపుకోవాలని కంపెనీ తెలిపింది.

MOST READ:కస్టమైజ్ ఫోర్డ్ పిక్-అప్ ట్రక్కు డ్రైవ్ చేస్తూ కనిపించిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' [వీడియో]

కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ. 70 లక్షల భీమా; బాష్

కంపెనీ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి మాట్లాడుతూ, ఉద్యోగులు కరోనా మహమ్మారి వల్ల మరణిస్తే ఉద్యోగులకు సగటున రూ .70 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మరణించిన ఉద్యోగి యొక్క చట్టపరమైన వారసులకు చెల్లించబడుతుందని కూడా అధికారికంగా పేర్కొంది.

కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ. 70 లక్షల భీమా; బాష్

ఈ మొత్తం ప్రస్తుతం ఉన్న రూ. 7 లక్షల ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఇడిఎల్ఐ) కు అదనంగా ఉంటుంది. ఆటో మొబైల్ పరిశ్రమలో ఈ రకమైన ప్రాజెక్టును ప్రకటించిన మొదటి సంస్థ బాష్ కాదు. ఈ కంపెనీ కంటే ముందు ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కూడా ఇలాంటి ప్రణాళికలను ప్రకటించింది.

MOST READ:కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ. 70 లక్షల భీమా; బాష్

కరోనాతో తమ ఉద్యోగులు మరణిస్తే వచ్చే రెండేళ్లపాటు ఉద్యోగులకు పూర్తి వేతనం ఇస్తామని బజాజ్ ఆటో అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు మరణించినవారి పిల్లల విద్య అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కంపెనీ తెలిపింది. కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్‌ను డిపెండెంట్లకు 5 సంవత్సరాల వరకు కూడా అందిస్తామని బజాజ్ ఆటో తెలిపింది. భాష్ మరియు బజాజ్ ఆటో కంపెనీలు చేసిన ఈ ప్రకటనలు తమ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉండటానికి సహాయపడతాయి.

Most Read Articles

English summary
Bosch Offers Insurance Coverage To Covid-19 Affected Employees' Families. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X