Just In
- 4 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 5 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 7 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ. 70 లక్షల భీమా; బాష్
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. ఈ విధంగా మరణిస్తున్న వారికి అండగా ఉండటానికి వాహన విడిభాగాల తయారీసంస్థ బాష్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రకటించింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణించినట్లతే మాత్రం ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది.
కరోనా మహమ్మారి వల్ల ఏవరైనా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మరణించినట్లతే 70 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా, ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కంపెనీ తగిన పరిష్కార చర్యలు తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీనితోపాటు కంపెనీ ఉద్యోగులు మరణిస్తే తన కుటుంబానికి మూడేళ్లపాటు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అందుతుందని కంపెనీ తెలిపింది.
కరోనా వైరస్ సంక్రమించడం వల్ల రోగులు శ్వాశకోశ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో కంపెనీ ఆక్సిజన్ మరియు ఇతర వైద్య పరికరాలను బెంగళూరు మరియు పూణే క్యాంపస్లలో అందిస్తూ కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
MOST READ:మతిపోగొడుతున్న మాడిఫైడ్ క్రెటా ఎస్యూవీ; వివరాలు
అంతే కాకుండా ప్రస్తుతం దేశంలో కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల, ప్రజలకు ఆక్సిజన్ అందించడానికి ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారంలో కూడా పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. కోవిడ్ 19 వల్ల కలిగే కష్టాల సమయంలో ఈ తయారీ యూనిట్లు సమాజానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి.
ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రజలకు తహమా వంతు సాయం చేయడానికి కంపెనీ ముందడుగులు వేస్తోంది. అంతే కాకుండా ప్రజలు కూడా ఒకరికొకరు సహకరించుకుని, సంఘీభావం తెలుపుకోవాలని కంపెనీ తెలిపింది.
MOST READ:కస్టమైజ్ ఫోర్డ్ పిక్-అప్ ట్రక్కు డ్రైవ్ చేస్తూ కనిపించిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' [వీడియో]
కంపెనీ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి మాట్లాడుతూ, ఉద్యోగులు కరోనా మహమ్మారి వల్ల మరణిస్తే ఉద్యోగులకు సగటున రూ .70 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మరణించిన ఉద్యోగి యొక్క చట్టపరమైన వారసులకు చెల్లించబడుతుందని కూడా అధికారికంగా పేర్కొంది.
ఈ మొత్తం ప్రస్తుతం ఉన్న రూ. 7 లక్షల ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఇడిఎల్ఐ) కు అదనంగా ఉంటుంది. ఆటో మొబైల్ పరిశ్రమలో ఈ రకమైన ప్రాజెక్టును ప్రకటించిన మొదటి సంస్థ బాష్ కాదు. ఈ కంపెనీ కంటే ముందు ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కూడా ఇలాంటి ప్రణాళికలను ప్రకటించింది.
MOST READ:కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?
కరోనాతో తమ ఉద్యోగులు మరణిస్తే వచ్చే రెండేళ్లపాటు ఉద్యోగులకు పూర్తి వేతనం ఇస్తామని బజాజ్ ఆటో అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు మరణించినవారి పిల్లల విద్య అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కంపెనీ తెలిపింది. కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్ను డిపెండెంట్లకు 5 సంవత్సరాల వరకు కూడా అందిస్తామని బజాజ్ ఆటో తెలిపింది. భాష్ మరియు బజాజ్ ఆటో కంపెనీలు చేసిన ఈ ప్రకటనలు తమ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉండటానికి సహాయపడతాయి.