BPCL EPA Grade Diesel భారత్‌లో డీజిల్‌ తయారీ కేంద్రం.. ఇకపై విదేశాలకు కూడా ఎగుమతులు.!!

పెట్రోల్‌, డీజిల్‌ కోసం భారత్‌.. అమెరికా ఇంకా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీని ద్వారా నాణ్యమైన డీజిల్‌కు డిమాండ్‌ కూడా అధికంగా ఉండటంతో.. ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఇక నుంచి భారత్‌.. ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇకనుంచి స్వదేశంలో డీజిల్‌ ఉత్పత్తి కానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత్‌లో పెట్రోల్, డీజిల్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. స్పష్టంగా చెప్పాలంటే, ప్రపంచంలోని అనేక దేశాలు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను వాడుకలో లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఆ జాబితాలో మన దేశం కూడా ఉంది.

BPCL-EPA-Grade-Diesel

ఎలక్ట్రిక్ వాహనాలు మరియు హైబ్రిడ్ వాహనాలను చురుకుగా ప్రోత్సహిస్తున్న భారత్‌.. ఇందుకోసం ప్రత్యేక పథకాలను కూడా అమలు చేస్తోంది. FAME-2 సబ్సిడీ ద్వారా ఆటో తయారీ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తుండటం ద్వారా ఈవీలు సరికొత్త మోడళ్లలో మార్కెట్‌లోకి విడుదల అవుతున్నాయి. ఇదే మాదిరిగా CNG వంటి ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను కూడా భారత్‌ ప్రోత్సహిస్తోంది.

ఇలాంటి పరిస్థితిలో తాజాగా దేశంలోని ప్రముఖ చమురు ఉత్పత్తిదారు BPCL (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) భారతదేశంలో కొత్త గ్రేడ్‌ డీజిల్‌ను విడుదల చేసింది. EPA గ్రేడ్ డీజిల్‌ను బీపీసీఎల్‌ పరిచయం చేస్తోంది. భారతదేశ ఇంధన రంగాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో BPCL ఈ నాణ్యమైన డీజిల్‌ను దేశంలో తీసుకువస్తోంది.

కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన BPCL MD కృష్ణకుమార్ దీనిని ఇటీవల ప్రారంభించారు. కాగా ఈ EPA గ్రేడ్‌ డీజిల్ స్థానికంగా ఉత్పత్తి చేయబడుతోంది. గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో దీనిని BPCL విడుదల చేయగా.. EPA గ్రేడ్ డీజిల్ కేరళ కొచ్చిలోని చమురు శుద్ధి కర్మాగారంలో తయారు చేస్తున్నారు.

సాధారణంగా ప్రీమియం నూనెలు జర్మనీ నుండి దిగుమతి అవుతాయనే సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం రాకుండా.. స్వదేశంలోనే నాణ్యమైన డీజిల్‌ తయారీని బీపీసీఎల్‌ ప్రారంభించింది. కాగా EPA గ్రేడ్ అనేది డీజిల్ యొక్క పర్యావరణ అనుకూలత యొక్క వ్యక్తీకరణ.. అంటే పర్యావరణానికి హాని కలిగించదు.

అయితే పెట్రోల్ కంటే డీజిల్ చాలా ఎక్కువ కాలుష్యకారకమైనదని తెలిసిందే.. కానీ బీపీసీఎల్ ఈ పరిస్థితిని మారుస్తోంది. ఈపీఏ గ్రేడ్‌ డీజిల్‌లో సల్ఫర్‌ తక్కువగా ఉండటంతో ఇది పర్యావరణానికి ఎక్కువగా హాని కలిగించదు. అందుకే దీనిని అల్ట్రా లో సల్ఫర్ డీజిల్ అని అంటున్నారు.

ఈ రకమైన డీజిల్‌ను ప్రస్తుతం భారత్ పెట్రోలియం యొక్క కొచ్చి రిఫైనరీలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నూనె కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు అవుతుంది. అందువల్ల, ఇది కేవలం భారతదేశ డిమాండ్‌ను మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల డిమాండ్‌ను కూడా నెరవేరుస్తుందని ఆటో నిపుణులు పేర్కొంటున్నారు.

ఈపీఏ గ్రేడ్‌ డీజిల్‌ ద్వారా భారత్‌లో డీజిల్‌ ఉత్పత్తి ప్రారంభం కావడంతో.. విదేశాల నుంచి దిగుమతులు కూడా చాలా వరకు తగ్గుతాయని తెలుస్తోంది. దీని ద్వారా విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున తగ్గుతుందని అంచనా వేయబడింది. ఈ ప్రయోజనం కోసమే భారతదేశంలో ఫ్లెక్స్ ఇంధన వాహనాలను ప్రమోట్ చేస్తున్నారు. త్వరలో ఈ తరహా వాహనాలు భారత్‌ను శాసించవచ్చు.

కాగా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారతీయుల్లో మాత్రం ఈ వాహనాలకు ఆదరణ తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. అదే సమయంలో, డీజిల్ వాహనాలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉండటంతో.. బీపీసీఎల్ ప్రవేశపెట్టిన EPA క్వాలిటీ డీజిల్ ఆటో మార్కెట్‌కు వరంగా మారనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 10, 2024, 9:09 [IST]
English summary
Bpcl launches epa grade diesel to boost indias energy sector checkfull details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+