Just In
Don't Miss
- News
కువైట్లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్ సరదా.. ఎలాగో తెలుసా ?
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో గుర్రంగూడ గో-కార్టింగ్ ప్లే జోన్లో ఓ 20 ఏళ్ల యువతి గో-కార్టింగ్ సరదా ఆమె ప్రాణం పోయేలా చేసింది. ఈ సంఘటన గుర్రంగూడలో ఉన్న హస్టెన్ గో-కార్టింగ్లో చోటుచేసుకుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

నివేదికల ప్రకారం గాయపడిన మహిళను నగరంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బిటెక్ విద్యార్థి శ్రీవర్షిణిగా పోలీసులు గుర్తించారు.

ఇన్స్పెక్టర్ ఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవర్షిణి తన స్నేహితులతో కలిసి హస్టన్ గో-కార్టింగ్కు వెళ్ళింది. గో-కార్ట్ నడుపుతుండగా వాహనం బోల్తా పడింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందడంతో మీర్పేట పోలీసులు అక్కడకు వెళ్లగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న హోండా హైనెస్ సిబి 350 బైక్ ఫస్ట్ లుక్

బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న శ్రీ వర్షిణి తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు అక్కడకి వెళ్లి, ప్లే జోన్లో ఉన్న కారులో కాసేపు రౌండ్స్ వేద్దాం అనుకుంది. ఓ యువకుడు కార్ డ్రైవింగ్ చేస్తుండగా శ్రీ వర్షిణి పక్కనే కూర్చుంది. అయితే కారు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

టైర్కు శ్రీ వర్షిణి తల వెంట్రుకలు చుట్టుకోవడంతో తల బలంగా నేలకు తగిలిందని, ఆమె పెట్టుకున్నహెల్మెట్ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైందని ఫ్రెండ్స్ చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీ వర్షిణి మృతి చెందింది.
MOST READ:ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

అర్ధరాత్రి సమయంలో గో-కార్టింగ్ కు అనుమతి ఇవ్వడంపైన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గో-కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీ వర్షిణి తల్లిదండ్రులు ఆరోపించారు. దీని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Note: Images are representative purpose only.