Just In
- 1 hr ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 2 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 4 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 6 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
Don't Miss
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Movies Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్ సరదా.. ఎలాగో తెలుసా ?
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో గుర్రంగూడ గో-కార్టింగ్ ప్లే జోన్లో ఓ 20 ఏళ్ల యువతి గో-కార్టింగ్ సరదా ఆమె ప్రాణం పోయేలా చేసింది. ఈ సంఘటన గుర్రంగూడలో ఉన్న హస్టెన్ గో-కార్టింగ్లో చోటుచేసుకుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
నివేదికల ప్రకారం గాయపడిన మహిళను నగరంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బిటెక్ విద్యార్థి శ్రీవర్షిణిగా పోలీసులు గుర్తించారు.
ఇన్స్పెక్టర్ ఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవర్షిణి తన స్నేహితులతో కలిసి హస్టన్ గో-కార్టింగ్కు వెళ్ళింది. గో-కార్ట్ నడుపుతుండగా వాహనం బోల్తా పడింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందడంతో మీర్పేట పోలీసులు అక్కడకు వెళ్లగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న హోండా హైనెస్ సిబి 350 బైక్ ఫస్ట్ లుక్
బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న శ్రీ వర్షిణి తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు అక్కడకి వెళ్లి, ప్లే జోన్లో ఉన్న కారులో కాసేపు రౌండ్స్ వేద్దాం అనుకుంది. ఓ యువకుడు కార్ డ్రైవింగ్ చేస్తుండగా శ్రీ వర్షిణి పక్కనే కూర్చుంది. అయితే కారు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
టైర్కు శ్రీ వర్షిణి తల వెంట్రుకలు చుట్టుకోవడంతో తల బలంగా నేలకు తగిలిందని, ఆమె పెట్టుకున్నహెల్మెట్ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైందని ఫ్రెండ్స్ చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీ వర్షిణి మృతి చెందింది.
MOST READ:ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు
అర్ధరాత్రి సమయంలో గో-కార్టింగ్ కు అనుమతి ఇవ్వడంపైన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గో-కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీ వర్షిణి తల్లిదండ్రులు ఆరోపించారు. దీని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Note: Images are representative purpose only.