Just In
- 13 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 14 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 17 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 18 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్
భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి దేశం మొత్తాన్ని లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ లాక్ డౌన్ కరోనావైరస్ వ్యాప్తిని నివారిస్తుంది. ఈ భయంకరమైన వైరస్ నివారణకు భారత ప్రభుత్వం చేపట్టిన 21 రోజుల లాక్ డౌన్ లో ప్రజలందరూ దీనికి మద్దతు ప్రకటిస్తూ ఇంట్లోనే ఉండాలి.
కరోనా వైరస్ నివారణకు చేపట్టిన లాక్ డౌన్ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలామంది పేద ప్రజలు సాధారణంగా పని చేసుకుని జీవనం సాగిస్తుంటారు. కానీ దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంటడం వల్ల చాలామంది ప్రజలకు పని లేకపోవడం వల్ల వలస కార్మికులందరూ తమ సొంత ప్రాంతాలకు తిరిగి ప్రయాణమవుతున్నారు.
చాలామంది వలస కార్మికులు తమ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి పని చేసుకుంటూ జీవిస్తారు. సాధారణంగా చాలామంది బీహార్, ఉత్తరప్రదేశ వంటి రాష్ట్రాలనుంచి పనుల కోసం ఢిల్లీకి వెళ్తారు. లాక్ డౌన్ కారణంగా పనిలేకపోవడంతో వీరంతా వారి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి సరైన రవాణా సదపాయాలు లేకపోవడం వల్ల కాలి నడకన తమ స్వగ్రామానికి ప్రయాణమయ్యారు.
లాక్ డౌన్ లో భాగంగా నోయిడా కూడా పూర్తిగా లాక్ చేయడం వల్ల ఈ వలస కార్మికులు వారి స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ప్రజలు తమ ఇళ్లకు తిరిగి రావడం అసాధ్యంగా మారింది.
ఈ సందర్భంలో వారి భోజన మరియు గృహ ఏర్పాట్లు అక్కడే ఏర్పరచడం జరిగింది. ఇక్కడ ఉన్న అంతర్జాతీయ సర్క్యూట్లో ప్రజలందరికీ వసతి మరియు వసతి కల్పించబడుతుంది. అంతే కాకుండా కరోనా వైరస్ సోకినా ప్రజలను నిర్బంధించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఇక్కడ ఉన్న కార్మికులను వారి ఇళ్లకు రవాణా చేయడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుమారు 1000 బస్సులను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ఉన్న కఠినమైన పరిస్థితుల కారణంగా వారిని అక్కడే ఉంచాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులను అనుసరించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జిపి స్పోర్ట్స్ సిటీని స్వాధీనం చేసుకుంది మరియు ఈ ప్రజలకు వసతి మరియు భోజన ఏర్పాట్లు చేసే పనిలో ఉంది.
MOST READ:అత్యవసర సేవా వాహనాలకు ఫ్రీ సర్వీస్ అంటున్న పిట్స్టాప్
ఇప్పుడు కరోనా వైరస్ మరింత ఎక్కువగా విస్తరిస్తున్న తరుణంలో మరింత కఠిన చర్యలను తీసుకోవడం వల్ల కరోనా భారీ నుంచి సులభంగా బయట పడవచ్చు. కానీ లాక్ డౌన్ సమయంలో నియమాలను ఉల్లంఘించి బయట తిరిగినట్లైతే మాత్రం ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునే అవకాశం లేదు.