Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 13 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 15 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్
భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి దేశం మొత్తాన్ని లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ లాక్ డౌన్ కరోనావైరస్ వ్యాప్తిని నివారిస్తుంది. ఈ భయంకరమైన వైరస్ నివారణకు భారత ప్రభుత్వం చేపట్టిన 21 రోజుల లాక్ డౌన్ లో ప్రజలందరూ దీనికి మద్దతు ప్రకటిస్తూ ఇంట్లోనే ఉండాలి.
కరోనా వైరస్ నివారణకు చేపట్టిన లాక్ డౌన్ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలామంది పేద ప్రజలు సాధారణంగా పని చేసుకుని జీవనం సాగిస్తుంటారు. కానీ దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంటడం వల్ల చాలామంది ప్రజలకు పని లేకపోవడం వల్ల వలస కార్మికులందరూ తమ సొంత ప్రాంతాలకు తిరిగి ప్రయాణమవుతున్నారు.
చాలామంది వలస కార్మికులు తమ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి పని చేసుకుంటూ జీవిస్తారు. సాధారణంగా చాలామంది బీహార్, ఉత్తరప్రదేశ వంటి రాష్ట్రాలనుంచి పనుల కోసం ఢిల్లీకి వెళ్తారు. లాక్ డౌన్ కారణంగా పనిలేకపోవడంతో వీరంతా వారి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి సరైన రవాణా సదపాయాలు లేకపోవడం వల్ల కాలి నడకన తమ స్వగ్రామానికి ప్రయాణమయ్యారు.
లాక్ డౌన్ లో భాగంగా నోయిడా కూడా పూర్తిగా లాక్ చేయడం వల్ల ఈ వలస కార్మికులు వారి స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ప్రజలు తమ ఇళ్లకు తిరిగి రావడం అసాధ్యంగా మారింది.
ఈ సందర్భంలో వారి భోజన మరియు గృహ ఏర్పాట్లు అక్కడే ఏర్పరచడం జరిగింది. ఇక్కడ ఉన్న అంతర్జాతీయ సర్క్యూట్లో ప్రజలందరికీ వసతి మరియు వసతి కల్పించబడుతుంది. అంతే కాకుండా కరోనా వైరస్ సోకినా ప్రజలను నిర్బంధించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఇక్కడ ఉన్న కార్మికులను వారి ఇళ్లకు రవాణా చేయడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుమారు 1000 బస్సులను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ఉన్న కఠినమైన పరిస్థితుల కారణంగా వారిని అక్కడే ఉంచాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులను అనుసరించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జిపి స్పోర్ట్స్ సిటీని స్వాధీనం చేసుకుంది మరియు ఈ ప్రజలకు వసతి మరియు భోజన ఏర్పాట్లు చేసే పనిలో ఉంది.
MOST READ:అత్యవసర సేవా వాహనాలకు ఫ్రీ సర్వీస్ అంటున్న పిట్స్టాప్
ఇప్పుడు కరోనా వైరస్ మరింత ఎక్కువగా విస్తరిస్తున్న తరుణంలో మరింత కఠిన చర్యలను తీసుకోవడం వల్ల కరోనా భారీ నుంచి సులభంగా బయట పడవచ్చు. కానీ లాక్ డౌన్ సమయంలో నియమాలను ఉల్లంఘించి బయట తిరిగినట్లైతే మాత్రం ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునే అవకాశం లేదు.