Just In
- 1 hr ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 2 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 3 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 3 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies కొత్త బాయ్ఫ్రెండ్తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ISIS దాడుల్లో బుల్లెట్లను తిప్పికొట్టిన 1990 కాలం నాటి బిఎమ్డబ్ల్యూ
మధ్య ప్రాచ్య దేశాల్లో జరుగుతున్న ఐఎస్ఐఎస్ దాడుల్లో ప్రజలను కాపాడేందుకు పురాతణ బిఎమ్డబ్ల్యూ బుల్లెట్ప్రూఫ్ను ఉపయోగించారు.
మధ్య
ప్రాచ్య
దేశాల్లో
ఉగ్రదాడులు
పెచ్చుమీరుతున్నాయి.
ISIS
ముష్కర
మూకలు
చేస్తున్న
అనర్థమైన
దాడుల్లో
అనేక
మంది
ప్రాణాలు
కోల్పోతున్నారు.
ఇలాంటి
సందర్భాల్లో
చాలా
మంది
తమను
తాము
రక్షించుకోవడానికి
ప్రయత్నిస్తుంటారు.
అయితే
ఒక
వ్యక్తి
ప్రాణాలను
సైతం
లెక్కచేయకుండా
తన
బుల్లెట్ప్రూఫ్
బిఎమ్డబ్ల్యూ
ద్వారా
ఐఎస్ఐఎస్
దాడులకు
వ్యతిరేకంగా
సామాన్య
ప్రజలను
కాపాడాడు.
అయితే ఈ బిఎమ్డబ్ల్యూ బుల్లెట్ప్రూఫ్ కారు ఈ కాలం నాటిది కాదు. పాత కాలం నాటి ఇది కాల్పులను ఎదుర్కొని మరీ ప్రజలను కాపాడటంలో ఎంతగానో ఉపకరిచింది.
కుర్ధిష్ పెష్మెర్గా తిరుగుబాటుదారుడు 1990 ల కాలం నాటి బిఎమ్డబ్ల్యూ బుల్లెట్ప్రూఫ్ కారును దాడులు జరిగిన అక్టోబర్ 21 కి నాలుగు నెలల క్రితం కొనుగోలు చేశాడు.
ఇరాక్లోని కుర్ధిష్ లో గల కిర్కుక్ అనే ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులు చేస్తుండగా అకొ రెహ్మాన్ అనే సైనికుడు సుమారుగా కొన్ని డజన్ల మందిని కాపాడాడు.
కుర్ధిష్ ప్రాంతీయ మీడియా సంస్థ ఆ ప్రాంతానికి చేరుకునే సరికి పరిస్థితి మొత్తం ఐస్ఐస్ ముష్కరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వారిని ఎదుర్కోడానికి అక్కడే ఉన్న భద్రతా బలగాలు సైతం ముందుకు రాలేదు.
గత కొన్ని రోజుల నుండి సామాన్య జన జీవనం మొత్తం స్తంభించిపోయింది. ఉగ్రదాడుల్లో గాయపడిన ప్రజలను, సైనికులను రెహ్మాన్ తన బిఎమ్డబ్ల్యూ సెడాన్లో సురక్షితంగా హాస్పిటల్కు చేరవేశాడు.
అకో రెహ్మాన్ గడిచిన రోజుల్లో కాల్పుల్లో గాయపడిన సుమారుగా 70 మందిని సురక్షితంగా సమయానికి హాస్పిటల్కు తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ద్వారా తరలించాడు.
బుల్లెట్ప్రూఫ్ బిఎమ్డబ్ల్యూ కారు యొక్క ముందు, వెనుక భాగాలలో మరియు అద్దం మీద జరిగిన కాల్పుల్లో 50 నుండి 60 వరకు బుల్లెట్లు తగిలిన గుర్తులు ఉన్నట్లు రెహ్మాన్ పేర్కొన్నాడు.
పెష్మర్గా దాడుల్లో ఎదురొడ్డి ప్రజల ప్రాణాలు కాపాడినందుకు అక్కడి గవర్నర్ ఇతగాడికి సుమారుగా 500,000 ఇరాక్ దినార్లు (385 అమెరికా డాలర్లు) ను బహుమానంగా ప్రకటించాడు.
ధైర్యవంతుడు మరియు త్యాగశీలి అయినటువంటి రెహ్మాన్కు బిఎమ్డబ్ల్యూ సంస్థ కూడా సత్కరించనుంది. ప్రస్తుతం బుల్లెట్ల దాడికి గురైన బిఎమ్డబ్ల్యూ ఇ32 కారును తీసుకుని దానికి బదులుగా సరికొత్త బిఎమ్డబ్ల్యూని ఇవ్వనుంది. బిఎమ్డబ్ల్యూ ఆ కారును తమ కార్పోరేట్ కార్యాలయంలో ప్రదర్శనగా ఉంచనుంది.
- ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ జిప్సీలనే వినియోగిస్తోంది, కారణం ?
- ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యన్ మిస్సైల్స్ ఇప్పడు భారత్ వద్ద
- ప్రమాదకర శత్రువుల అంతానికి ఈ ఐదు ఎంతో కీలకం