Just In
- 1 hr ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 3 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 11 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 17 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
అంబులెన్స్ ముందుకు వెళ్ళడానికి దారి ఇవ్వని కార్ డ్రైవర్కి ఏం జరిగిందో చూసారా ?
ఇటీవల కర్ణాటకలోని మైసూర్లో 85 ఏళ్ల జబ్బుపడిన వ్యక్తికి ఆసుపత్రిని తీసుకెళ్తున్న అంబులెన్స్కు దారి ఇవ్వనందుకు జరిమానా విధించారు. అంబులెన్సుకి దారి వదలని కారు డ్రైవర్కు రూ. 11 వేల జరిమానా విధించారు. అయితే ఆసుపత్రికి రావడం ఆలస్యం కారణంగా ఆ వ్యక్తి చనిపోయినట్లు ప్రకటించారు.
కార్ల డ్రైవర్ జయనాథ్కు అత్యవసర వాహనానికి మార్గం ఇవ్వనందుకు రూ. 10,000, ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినందుకు రూ. 1000 జరిమానా విధించినట్లు మైసూర్ సిటీ అసిస్టెంట్, పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) తెలిపారు. దీనికి మోటారు వాహనాల చట్టం, 2019 కింద జరిమానా విధించారు.
ఆగస్టు 22 న 85 ఏళ్ల చంద్రశేఖర్ ఆచార్యకు గుండెపోటు వచ్చింది. అతన్ని అంబులెన్స్లో మైసూర్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 8.30 గంటల సమయంలో అంబులెన్స్ హోసూర్ రహదారికి చేరుకోగానే, జయనాథ్ నడుపుతున్న కారును రోడ్డుపై ఆపివేశారు.
MOST READ:నీటిపై నడిచే బైక్.. వీడియో చూసారా ?
అంబులెన్స్ హార్నింగ్ మరియు సైరన్లు ఉన్నప్పటికీ కూడా జయనాథ్ తన కారును రోడ్డు నుండి తొలగించలేదు. జయనాథ్ కారును రోడ్డుపైనే ఉంచారు ఈ కారణంగా ట్రాఫిక్ ఎక్కువయింది.
అంబులెన్స్ డ్రైవర్ కిషోర్ జయనాథ్ను అంబులెన్స్ నుంచి వైదొలగాలని కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రోగి బంధువులు కూడా అంబులెన్స్ నుంచి దిగి జయనాథ్ను వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది.
MOST READ:కార్ డ్రైవ్ చేసి అమ్మమ్మ ప్రాణాలను కాపాడిన 11 ఏళ్ల బాలుడు [వీడియో]
ఇది 15 నిమిషాల విలువైన సమయాన్ని వృధా చేసాడు. అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకునే సమయానికి, ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఆసుపత్రికి రాగానే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
గుండెపోటు ఉన్నప్పుడు ప్రతి సెకను విలువైనది. జయనాథ్ వల్ల 15 నిమిషాలు వృధా అయింది. సమయానికి అంబులెన్స్ ఆసుపత్రికి వచ్చి ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడేవాడు. అంబులెన్స్కు ఆటంకం కలిగించిన జయనాథ్పై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
MOST READ:మూలికా పెట్రోల్ తయారీకి కేరళ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నెల్
గత సంవత్సరం అమలు చేసిన కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం, అత్యవసర వాహనాలకు మార్గం ఇవ్వని వారికి భారీ జరిమానా విధించబడుతుంది. అత్యవసర వాహనాల్లో అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్, పోలీసు వాహనాలు ఉన్నాయి.