కారు కొనడానికి ముందు ఇలా చేయడం తప్పనిసరి: తెలుసా..!!
కార్లు కొనాలనుకునే వినియోగదారులకు సాధారణంగా ఇంటర్నెట్ మరియు డిజిటల్ మీడియా చాలా సహాయంగా ఉంటుంది. ఎందుకంటే వినియోగదారులకు ఏ కారు కావాలో ఆ కారు గురించి పూర్తి వివరాలు ఇంటర్నెట్ లో లభిస్తాయి. కారు కొనడానికి ముందే వినియోగదారులు ఏ కారు సముచితమో తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో సర్చ్ చేయడం సర్వసాధారణం.

ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం, 90% మంది కొనుగోలుదారులు ఏ కారు కొనాలో నిర్ణయించడానికి ఇంటర్నెట్ లేదా డిజిటల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తున్నారని గూగుల్ యొక్క టిఎన్ఎస్ పరిశోధన ద్వారా తెలిపింది.

ఈవిధంగా సర్చ్ చేసుకోవడం వల్ల కార్ షోరూమ్ల వద్ద రద్దీ తగ్గుతుంది. గూగుల్ మరియు యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫాంలు కారు గురించి సమాచారాన్ని సేకరించడానికి ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. సంస్థ యొక్క వెబ్సైట్ ద్వారా కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఈ డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా వినియోగదారులు తమ అభిమాన కార్ల యొక్క ఫీచర్స్, పవర్, మైలేజ్ మరియు ధర మొదలైన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. చిన్న పట్టణాలు మరియు నగరాల్లో కూడా వినియోగదారులు వాహనాన్ని కొనడానికి ముందు ఆన్లైన్లో పరిశోధన చేస్తారు.

కానీ చాలా మంది వినియోగదారులు ఆన్లైన్లో వాహనాలను కొనడానికి ఆసక్తి చూపరు. కారు ఎందుకు ఖరీదైనదో ఆన్లైన్లో సమాచారం సేకరించిన తరువాత షోరూమ్కి వెళ్లి తనిఖీ చేసి కొంటారు.

ఇటీవల హ్యుందాయ్ కంపెనీ క్లిక్ టు బై అనే ఫీచర్ను కూడా ప్రవేశపెట్టింది. వినియోగదారులు ఇంటి నుండి ఆన్లైన్లో కార్లను ఆర్డర్ చేయవచ్చు. ఆన్లైన్లో కారును కొనుగోలు చేసిన తర్వాత కంపెనీ కారును ఇంటికి డెలివరీ చేస్తుంది.

భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా చాల ఆటో సంస్థలు తవ వాహనాలను ఆన్లైన్లో విక్రయిస్తోంది. అంతే కాకుండా వాహనాలను డోర్ డెలివరీ చేయడానికి కూడా సన్నాహాలను సిద్ధం చేస్తోంది.
మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ బాగా పెరుగుతున్న సమయంలో ఏ మరు మూల ప్రాంతంలో ఉన్న వారు కూడా వాహనాల గురించి మరింత సమాచారాన్ని డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా తెలుసుకునే అవకాశాలు ఇప్పుడు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








