నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి
భారతదేశంలో హైవేలపై అప్పుడప్పుడు దారి దోపిడీలు జరుగుతూ ఉంటాయి, దీనికి సంబంధించిన చాలా విషయాలు మనం ఇది వరకటి కథనాలతో తెలుసుకున్నాం. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ దారి దోపిడీలకు ఎక్కువగా పాల్పడుతూ ఉంటారు. కాబట్టి హైవేలు రాత్రి సమయంలో అంత సురక్షితం కాదు. ఇటీవల ఇలాంటి ఒక దొంగతనం వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఈ సంఘటన ఒడిస్సాలో జరిగినట్లు తెలుస్తుంది. సాధారణంగా కొన్ని సార్లు ట్రక్ డ్రైవర్లు, కార్ డ్రైవర్లు మరియు ద్విచక్ర వాహనాలు రహదారులపై అప్పుడప్పుడు నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై నిలిపి ఉంచుతారు. ఒడిశాలోని జాజ్పూర్లోని రహదారిపై కొంతమంది దుండగులు కారును ఆపి దోచుకోవడానికి ప్రయత్నించారు.

ఈ వీడియోలో మనం గమనించినట్లయితే కార్ డ్రైవర్ ని భయపెట్టి కారుని దోచుకోవాలని ప్రయత్నించారు. కానీ డ్రైవర్ ఎంతో చాకచక్యంగా సామర్థ్యాన్ని చూపించకపోతే, అతని కారును దొంగలు దోచుకొని ఉండవచ్చు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై కారు నడుపుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఆ రహదారిపై ఎటువంటి వెలుగు లేదు, కాబట్టి చాలా చీకటిగా ఉంది.

కారు హైవేపై కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి డ్రైవర్ ముఖం మీద ప్రకాశవంతమైన లైట్ ఫ్లష్ లైట్ లేదా LED ఫ్లాష్ లైట్ లాంటిది వేస్తాడు. డ్రైవర్ మొదట అతనిని ఆపమని ఆదేశిస్తున్నాడని అనుకుంటాడు. అప్పుడు అతను కారు ముందు మరో ముగ్గురు వచ్చి తన ముఖం బట్టలతో కప్పబడి ఉన్నట్లు చూస్తాడు.

కారు డ్రైవర్ వారు పోలీసులు కాదని నిర్దారించుకుని, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని తెలుసుకుంటాడు. తనను దోచుకోవడానికి ముందు ఉన్నవారు కారును ఆపుతున్నారని అతను గ్రహించాడు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు చేతిలో రాడ్ లాంటిది పట్టుకుని కారు వైపు కదులుతారు. ఇది చూసిన డ్రైవర్ కారును రివర్స్ గేర్లో ఉంచి వేగంగా కారును వెనుకకు నడుపుతాడు.

కారు వెనుక వెళ్లిపోవడం చూసి, దొంగలు కూడా అతనిని వెంబడిస్తారు, కాని కారు వేగాన్ని దొంగలు అందుకోలేకపోతారు. అంతే కాకుండా వారి చేతిలో ఉన్న వస్తువులను ఆ కార్ పైకి విసురుతారు. అయితే, కారు డ్రైవర్ చాలా వేగంగా వెళ్ళిపోయి ఆ దొంగల భారీ నుంచి తప్పించుకుంటాడు.

ఈ సంఘటన గురించి కారు డ్రైవర్ పోలీసులకు ఎటువంటి పిర్యాదు చేయలేదు. దీనికి సంబంధించి ఒడిశా పోలీసులు కూడా ఎటువంటి సమాచారం విడుదల చేయలేదు.
రాత్రి చీకటిలో దొంగలు కాకుండా, పగటిపూట కూడా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కారు దోపిడీదారుల కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ దొంగలు మొదట కారులో ఉంచిన వస్తువులు మరియు డబ్బును లక్ష్యంగా చేసుకుంటారు. కారును రీకియింగ్ చేసిన తరువాత, వారు అతనిని మరల్చడం ద్వారా డ్రైవర్ ని దోచుకోవడానికి ప్రయత్నిస్తారు.

భారతీయ రోడ్లపై రోజు రోజుకి వాహన దొంగతనాల కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీనిని నివారించడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. వాహన తయారీదారులు కూడా వాహనాలను దొంగతనం భారీ నుంచి తప్పించడానికి వాహనాలలో అనేక ఆధునిక ఫీచర్స్ కూడా ప్రవేశపెడుతున్నారు. ఏది ఏమైనా ఇటువంటి దొంగతనాలు మరియు దారి దోపిడీలు జరగకుండా నిలువరించడానికి మరిన్ని ప్రయత్నాలు జరగాలి, అప్పుడే ఇవి పూర్తి స్థాయిలో నిలువరించే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








