Just In
- 1 hr ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 2 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 3 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 3 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Movies కొత్త బాయ్ఫ్రెండ్తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా వల్ల స్టార్ట్ అయిన కొత్త బిజినెస్, ఏంటో తెలుసా ?
భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గత రెండు నెలలుగా భారతదేశంలో ఈ వైరస్ అనుకున్నదానికంటే ఎక్కువగా వ్యాపించింది. దీని ఫలితంగా భారతదేశం అపారమైన నష్టాలను చవిచూస్తోంది.
ఈ కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయబడ్డాయి. దీనివల్ల అన్ని వ్యాపార లావాదేవీలు ఆగిపోయాయి. అనేక సంస్థలు శాశ్వతంగా మూసివేయబడ్డాయి.
లాక్ డౌన్ కొన్నింటిపై తాత్కాలిక ప్రభావాన్ని కలిగి చూపించినప్పటికీ, మరికొన్ని వాటిపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని సంస్థలు తమ ఆర్థిక పరిస్థితిని కవర్ చేయడానికి ఉద్యోగులను తొలగించడం జరిగింది.
MOST READ:విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్నారా, అయితే ఇవి తప్పనిసరిగా పాటించాలి
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాలలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కానీ ఘోరమైన కరోనా వైరస్ కూడా కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో ప్రజలు క్రిమినాశక మరియు ఇతర భద్రతా చర్యలను అనుసరిస్తున్నారు.
మాస్కులు మరియు క్రిమినాశక మందులను తయారుచేసే సంస్థలు కూడా ప్రారంభమ అయ్యాయి. అంతే కాకుండా ప్రధాన నగరాల్లో వాహన శుభ్రపరిచే యూనిట్లు తెరవబడుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
MOST READ:1200 కి.మీ తన తండ్రిని సైకిల్ పై తీసుకువచ్చిన 15 ఏళ్ల అమ్మాయి
కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు ప్రజా వాహనాలకు బదులుగా సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. కరోనా వైరస్ వాహనాల ద్వారా కూడా వ్యాపిస్తుందనే ఆందోళనలు కూడా ప్రజలలో ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని ప్రైవేట్ సంస్థలు వాహనాలను శుభ్రపరచడానికి కొన్ని కొత్త పద్దతులను అనుసరిస్తున్నారు.
ఢిల్లీలో పెద్ద సంఖ్యలో పారిశుధ్య కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడా పారిశుధ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
MOST READ:ఇది మాడిఫైడ్ టయోటా అంబులెన్స్.. చూసారా !
ఇంతకుముందు వాటర్ వాష్ మిషన్స్ మాత్రమే చేస్తున్న కంపెనీలు ఇప్పుడు పారిశుధ్య కేంద్రాలను ఓపెన్ చేస్తుంది. లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కొంత మినహాయింపు ఇవ్వబడింది.
అందుకే ఇంటికే పరిమితమైన ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం ప్రారంభించారు. కానీ వైరస్ వ్యాపిస్తుందనే భయంతో ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏంజరుగుతోందో తెలుసా.. అయితే ఇది చూడండి
MOST READ:ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏంజరుగుతోందో తెలుసా.. అయితే ఇది చూడండి
దీన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుధ్య కేంద్రాలు ప్రారంభించారు. ఈ పారిశుధ్య కేంద్రాలలో వాహనాలకు రూ. 20 నుంచి రూ. 100 వరకు వసూలు చేయబడుతుంది. ద్విచక్ర వాహనాలకు కనీస ధర 20 రూపాయల నుంచి రూ. 50 మరియు రూ. 100 వరకు వసూలు చేస్తున్నారు.