ఇలా చేస్తే కరోనా వైరస్ చావడం కాయం, ఎలానో తెలుసా !
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గగడలాడిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల చాలామంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయాలు. అంతే కాకుండా చాలామంది ఈ వైరస్ మహమ్మారి భారిన పడ్డారు. కరోనా వైరస్ భారతదేశంలో కూడా ఎక్కువగా వ్యాపించింది. కరోనా నివారణకోసం ఇప్పటికే చాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జార్జియా యూనివర్సిటీ ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది.

జార్జియా యూనివర్సిటీ యొక్క తాజా అధ్యయనం ప్రకారం, ఎండలో ఆగే కారు లోపల ఉన్న వేడి వల్ల కరోనా వైరస్ చనిపోతుంది అని తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం కారు యొక్క వేడి వల్ల 99.99% కరోనా వైరస్ చనిపోతుంది నిర్థారించారు.

కరోనా వైరస్ కారు లోపల ఉన్న వివిధ ఉష్ణోగ్రతలలో 5 నుండి 20 నిమిషాలు మాత్రమే జీవించగలదని తెలిపారు. న్యూస్ 18 ఆటోలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, కారు లోపల ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది, బయటి ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్. బయటి ఉష్ణోగ్రత పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కారు లోపల అధిక వేడిని సృష్టించడం వల్ల కోవిడ్-19 మాత్రమే కాకుండా ఇతర వైరస్ లు కూడా చనిపోతాయి.

మునుపటి అధ్యయనాల ప్రకారం కోవిడ్ -19 వైరస్, కాగితం మరియు కార్డ్బోర్డ్ మీద ఒక రోజు, ప్లాస్టిక్ మరియు ఇనుము మూడు రోజులు నివసిస్తుంది. కారు లోపల ఉష్ణోగ్రత 54 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు, 99.99% వైరస్లు 20 నిమిషాల్లో చనిపోతాయని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది.

ఉష్ణోగ్రత 74 సెల్సియస్ ఉంటే, వైరస్ 5 నిమిషాల్లో చనిపోతుంది. జార్జియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ట్రావిస్ గ్లెన్ ప్రకారం, అధ్యయనం ఇంకా కొనసాగుతోంది మరియు త్వరలో అనేక కొత్త విషయాలు వెలువడే అవకాశం కూడా ఉంది. ఉష్ణోగ్రత పెరిగితే వైరస్ మనుగడ సమయం తగ్గుతుందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రొఫెసర్ ట్రావిస్ మాట్లాడుతూ, మేము కారును ఎండలో పార్క్ చేస్తే, కారు లోపల ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ కరోనా వైరస్ చనిపోతుంది. కారును సూర్యరశ్మిలో లేదా సూర్యకాంతిలో నిలిపివేస్తే, అందులోని వైరస్లను సులభంగా నాశనం చేయవచ్చు అని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా, కరోనావైరస్ సంక్రమణల సంఖ్య ఇప్పటికి 50 లక్షలకు పైగా ఉంది మరియు 3.30 లక్షలకు పైగా ప్రజలు మరణించారు. గత కొన్ని రోజులుగా భారతదేశంలో కరోనా సోకిన వారి సంఖ్య భారీగా పెరిగింది.

భారతదేశంలో, కరోనా బారిన పడిన వారి సంఖ్య 1 లక్ష దాటింది మరియు 3,583 మంది మరణించారు. ఈ సంక్రమణ నుండి 48,534 మంది కోలుకున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ వల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఏది ఏమైనా కరోనా నియంత్రణకు చాలామంది చాలా రకాలుగా కృషి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








