కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరం పాటించకపోతే జరిమానా ఎంతో తెలుసా ?

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి 2020 మార్చి 24 నుండి లాక్‌డౌన్ అమలు చేయబడింది. లాక్‌డౌన్ సమయంలో అన్ని రకాల ప్రజా రవాణా రద్దు చేయబడింది. ప్రజా రవాణా రద్దు చేయడంతో దాదాపు అన్ని వాహన సేవలు నిలిపివేయబడ్డాయి.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరం పాటించకపోతే జరిమానా ఎంతో తెలుసా ?

కరోనా లాక్‌డౌన్ సమయంలో కార్లు మరియు బైక్‌లతో సహా అన్ని రకాల ప్రైవేట్ వాహనాలను నిరోధించారు. ప్రస్తుతం ఇప్పుడు లాక్‌డౌన్ కొన్ని సడలింపులను కలిగి ఉంది. ఈ తరుణంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాహనసేవలు ప్రారంభించబడ్డాయి.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరం పాటించకపోతే జరిమానా ఎంతో తెలుసా ?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ సడలింపులతో ట్రైన్ మరియు విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభించబడ్డాయి. ఆటో మరియు టాక్సీ ట్రాఫిక్ కూడా అనుమతించబడుతుంది. దీనివల్ల వాహనాల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరం పాటించకపోతే జరిమానా ఎంతో తెలుసా ?

కరోనా వైరస్ అంటువ్యాధికి ఇప్పటివరకు వ్యాక్సిన్ కనుగొనబడలేదు. నివారణ జాగ్రత్తలు తీసుకొని వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడం ఒకటే ప్రస్తుతం మార్గం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా పేస్ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని తప్పని సరిగా పాటించాలి. అప్పుడే కరోనాని కొంత వరకు నివారించవచ్చు.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరం పాటించకపోతే జరిమానా ఎంతో తెలుసా ?

ప్రస్తుతం ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నారు. చండీగర్ ఆరోగ్య శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దిగ్బంధంలో ఉన్నవారికి మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వారికి రూ. 2,000 జరిమానా విధించబడుతుంది.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరం పాటించకపోతే జరిమానా ఎంతో తెలుసా ?

సామాజిక దూరాన్ని పాటించని దుకాణ యజమానులకు రూ. 500 జరిమానా విధిస్తారు. సామాజిక దూరం యొక్క నియమాలు వాహనాలకు కూడా వర్తిస్తాయి. సామాజిక దూరాన్ని పాటించని బస్సులకు రూ. 3,000 జరిమానా విధిస్తారు. కార్లకు రూ. 2000 జరిమానా విధిస్తారు.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరం పాటించకపోతే జరిమానా ఎంతో తెలుసా ?

ఆటో / ద్విచక్ర వాహనాలకు రూ. 500 జరిమానా విధించడంజరుగుతుంది. ఈ విధానగా కఠినమైన నిబంధనలను అమలు చేయడం వల్ల ప్రజలలో కొంత భయం మొదలవుతుంది. ఇది వాహనదారులకు సామాజిక దూరాన్ని పాటించడానికి దోహదపడుతుందని చండీగర్ పరిపాలన అధికారులు తెలిపారు.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరం పాటించకపోతే జరిమానా ఎంతో తెలుసా ?

కరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది మరియు వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం భారతదేశంలోముంబై, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలు కరోనా వైరస్ ఎక్కువగా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, June 8, 2020, 14:46 [IST]
English summary
Chandigarh police fine motorists for violating social distancing norms. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+