Just In
- 47 min ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 1 hr ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 15 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 18 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
Don't Miss
- News పాపం అంబాని, ఆదానిలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్ చేసిన సీఎం
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఆలస్యంగా పట్టుబడ్డ ఘరానా దొంగ ; 13 బైకులు స్వాధీనం
భారతదేశంలో తరచుగా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కువగా బైక్ దొంగతనాలు జరిగే ప్రాంతాలలో తమిళనాడు ఒకటి. చెన్నై మరియు దాని శివారు ప్రాంతాల్లో బైక్ దొంగతనం కేసులు ఎక్కువగా ఉన్నాయి. బైక్ దొంగతనం జరగకుండా పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు.
కానీ బైకర్లు కొత్త టెక్నాలజీలతో బైక్లను దొంగలిస్తున్నారు. బైక్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని ఇటీవల కాలంలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి మొత్తం 13 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇళ్ళు, షాపుల ముందు నిలిపిన బైక్ల దొంగతనం గురించి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అవదీ సమీపంలోని కరుణాగరచేరి ప్రాంతంలో జూన్ 14 న పోలీసులు తనిఖీ చేస్తున్నారు. బైక్ రైడర్ను విచారించి తనిఖీ చేశారు. అతను పోలీసు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాడు మరియు పోలీసులు తీవ్రమైన పరిశీలనకు గురిచేశారు.
MOST READ:కూతుర్ని కారు షోరూమ్కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది
అతను ప్రయాణిస్తున్న బైక్కు ఎటువంటి రికార్డులు లేవు. అతను బయట అందరికి జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. అతను గుర్తింపు కార్డును కూడా చూపించాడు. ఇది నకిలీ గుర్తింపు కార్డు అని పోలీసులు నిర్దారించారు.
అనంతరం అతన్ని పట్టాబ్రామ్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి తీవ్ర తనిఖీలు చేశారు. పోలీసుల విచారణలో అతని పేరు విక్టర్ అలియాస్ నరేష్ గా గుర్తించబడింది. 38 ఏళ్ల నరేష్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను తిరువళ్ళూరు సమీపంలోని పుల్లారంపక్కం గ్రామానికి చెందినవాడు.
MOST READ:కోవిడ్-19 భయం; చాలా చోట్ల రాయల్ ఎన్ఫీల్డ్ రీజనల్ ఆఫీసులు బంద్!
గత రెండేళ్లుగా అతను తన భార్య, పిల్లలతో కలిసి నవజీవన్ నగరంలోని పవబ్రామ్లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. నరేష్ ఇప్పటికే చాల బైక్లను దొంగలించినట్లు విచారణలో తేలింది.
తిరువల్లూరు, తిరునినూర్, పట్టాబ్రామ్, తిరుముల్లైవయాల్, అంబత్తూరులలో మొత్తం 13 బైకులు దొంగిలించబడ్డాయి. 13 బైక్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరేష్ను పోలీసులు అరెస్టు చేసినట్లు దినకరన్ వార్తాపత్రిక తెలిపింది.
MOST READ:స్క్రాప్ మెటీరియల్తో లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు
రక్షణ లేని ప్రదేశంలో పార్క్ చేసినప్పుడు సాధారణంగా చాలా బైక్లు దొంగిలించబడతాయి. కాబట్టి వాహనదారులు సాధ్యమైనంత సురక్షితమైన ప్రదేశాలలో పార్క్ చేయడం మంచిది. కొంతమంది వాహనం తాళాలు మరచి బైక్ అక్కడే వదిలివేస్తారు. వాహనదారులు పార్క్ చేసేటప్పుడు వాహనం యొక్క కీ మరచిపోకుండా తీసుకెళ్లడం మంచిది. ఈ విధంగా చేసినప్పుడు కొంతవరకు వాహన దొంగతనాలు నిలువరించవచ్చు.