Just In
- 11 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 11 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 13 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 13 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆలస్యంగా పట్టుబడ్డ ఘరానా దొంగ ; 13 బైకులు స్వాధీనం
భారతదేశంలో తరచుగా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కువగా బైక్ దొంగతనాలు జరిగే ప్రాంతాలలో తమిళనాడు ఒకటి. చెన్నై మరియు దాని శివారు ప్రాంతాల్లో బైక్ దొంగతనం కేసులు ఎక్కువగా ఉన్నాయి. బైక్ దొంగతనం జరగకుండా పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు.
కానీ బైకర్లు కొత్త టెక్నాలజీలతో బైక్లను దొంగలిస్తున్నారు. బైక్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని ఇటీవల కాలంలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి మొత్తం 13 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇళ్ళు, షాపుల ముందు నిలిపిన బైక్ల దొంగతనం గురించి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అవదీ సమీపంలోని కరుణాగరచేరి ప్రాంతంలో జూన్ 14 న పోలీసులు తనిఖీ చేస్తున్నారు. బైక్ రైడర్ను విచారించి తనిఖీ చేశారు. అతను పోలీసు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాడు మరియు పోలీసులు తీవ్రమైన పరిశీలనకు గురిచేశారు.
MOST READ:కూతుర్ని కారు షోరూమ్కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది
అతను ప్రయాణిస్తున్న బైక్కు ఎటువంటి రికార్డులు లేవు. అతను బయట అందరికి జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. అతను గుర్తింపు కార్డును కూడా చూపించాడు. ఇది నకిలీ గుర్తింపు కార్డు అని పోలీసులు నిర్దారించారు.
అనంతరం అతన్ని పట్టాబ్రామ్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి తీవ్ర తనిఖీలు చేశారు. పోలీసుల విచారణలో అతని పేరు విక్టర్ అలియాస్ నరేష్ గా గుర్తించబడింది. 38 ఏళ్ల నరేష్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను తిరువళ్ళూరు సమీపంలోని పుల్లారంపక్కం గ్రామానికి చెందినవాడు.
MOST READ:కోవిడ్-19 భయం; చాలా చోట్ల రాయల్ ఎన్ఫీల్డ్ రీజనల్ ఆఫీసులు బంద్!
గత రెండేళ్లుగా అతను తన భార్య, పిల్లలతో కలిసి నవజీవన్ నగరంలోని పవబ్రామ్లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. నరేష్ ఇప్పటికే చాల బైక్లను దొంగలించినట్లు విచారణలో తేలింది.
తిరువల్లూరు, తిరునినూర్, పట్టాబ్రామ్, తిరుముల్లైవయాల్, అంబత్తూరులలో మొత్తం 13 బైకులు దొంగిలించబడ్డాయి. 13 బైక్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరేష్ను పోలీసులు అరెస్టు చేసినట్లు దినకరన్ వార్తాపత్రిక తెలిపింది.
MOST READ:స్క్రాప్ మెటీరియల్తో లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు
రక్షణ లేని ప్రదేశంలో పార్క్ చేసినప్పుడు సాధారణంగా చాలా బైక్లు దొంగిలించబడతాయి. కాబట్టి వాహనదారులు సాధ్యమైనంత సురక్షితమైన ప్రదేశాలలో పార్క్ చేయడం మంచిది. కొంతమంది వాహనం తాళాలు మరచి బైక్ అక్కడే వదిలివేస్తారు. వాహనదారులు పార్క్ చేసేటప్పుడు వాహనం యొక్క కీ మరచిపోకుండా తీసుకెళ్లడం మంచిది. ఈ విధంగా చేసినప్పుడు కొంతవరకు వాహన దొంగతనాలు నిలువరించవచ్చు.