బైకర్స్ తప్పకుండా ఈ రూల్స్ పాటించాలి.. లేకుంటే?
భారతదేశంలో కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఈ మహమ్మరి కారణంగా ఎంతో మంది ప్రజలు మరణిస్తున్నారు. కరోనా వైరస్ భారిన పడి ఎక్కువ మంది ప్రజలు మరణిస్తున్న కారణంగా దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రల్లో కరోనా లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. ఈ లాక్ డౌన్ ఇప్పటికి కూడా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉంది.

కరోనా మహమ్మారిని నివారించడానికి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంది. ఈ సమయంలో అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు బయటకు రావడానికి నిషేధం కూడా విధించబడింది. కావున ప్రజలు బయటకు రావడం నిషేధం తప్పనిసరిగా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు కర్ఫ్యూ పాస్ తీసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది.

దేశ వ్యాప్తంగా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఈ సమయంలో తమిళనాడు రాజధాని నగరమైన చెన్నైలో ద్విహక్రవాహనదారులపై కొత్త ఆంక్షలు చేస్తూ సంబంధిత అధికారులు ఉత్తర్వులు జరీ చేశారు. ఈ కారణంగా ద్విచక్ర వాహనదారులు తప్పకుండా ఈ రూల్స్ పాటించాలి.

ఇప్పుడు ఈ నిబంధన ప్రకారం బైక్ పై ఒకరికంటే ఎక్కువమంది లేదా ఒకే కుంటుంబానికి చెందిన వ్యక్తులు ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తు ప్రయాణించడం పూర్తిగా నిషేధించబడింది. దీనితో పాటు వాహనదారులు తప్పకుండా అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదనే ఒక నిబంధన కూడా అమల్లో ఉంది. కావున వాహనదారుడు దీనికి అనుకూలంగా నడుచుకోవాలి.

ప్రస్తుతం భారతదేశంలో వ్యాపించిన కరోనా సెకండ్ వేవ్, గత సంవత్సరం వ్యాపించిన కరోనా మొదటి దశకంటే ఎక్కువగా వ్యాపిస్తోంది. కావున మరణాలు రేటు మునుపటి సంవత్సరం కంటే కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

ప్రస్తుతం కరోనా ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తున్న కారణంగా సామజిక దూరం వంటివి తప్పకుండా పాటించాలి. కావున ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులకు ఇది సాధ్యం కాదు కావున బైక్ పై ఒకరు మాత్రమే అత్యవసర సమయంలో ప్రయాణించడానికి అనుమతించబడుతుంది.

ఇదిలా ఉండగా కరోనా రోజురోజుకి ఎరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ వ్యవధి పొడిగిస్తూ చాలా రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీని ప్రకారం ఈ లాక్ డౌన్ వ్యవధి ఇంకొక వరం ముందుకు సాగింది. ఈ సమయంలో ప్రజలు దాదాపుగా బయటకు రాకుండా ప్రభుత్వాలకు సహకరించాలి అప్పుడే ఈ మహమ్మారిని తరిమికొట్టగలం.


Click it and Unblock the Notifications








