Just In
- 4 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 5 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 7 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 10 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మొబైల్ సెలూన్ ద్వారా రోజుకి రూ. 1,500 సంపాదిస్తున్న వ్యక్తి: ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి
కరోనా మహమ్మారి విలయతాండవం వల్ల ఎంతోమంది ప్రజల జీవితాలు దుర్భర స్థితిలోకి వెళ్లిపోయాయి. ఈ మహమ్మారి కారణంగా లెక్కకు మించిన ప్రజలు మరణించారు. ఎంతోమంది ప్రజలు ఈ వైరస్ ప్రభావానికి లోనయ్యారు. ఈ సమయంలోనే ఎంతోమంది ప్రజలు జీవనోపాధిని కోల్పోయారు.
కొరోనా వైరస్ గత ఏడాదిన్నర కాలంగా భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను పట్టి పీడిస్తోంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారు ఉద్యోగం లేకుండా భారతదేశానికి తిరిగి వచ్చేస్తున్నారు. కరోనావైరస్ వేవ్ ప్రభావం భారీగా ఉన్నప్పటికీ ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన కారణంగా ఇప్పుడు తమదైన రీతిలో ఉపాధి వెతుక్కుంటున్నారు. ఇటీవల కొన్ని సంఘటనలు వెలువడ్డాయి, ఇందులో ఇన్నోవా కారుని కూరగాయలు అమ్మడానికి ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఇదే తరహాలో ఇప్పుడుఆ ఒక వ్యక్తి ఒక మొబైల్ సెలూన్ ప్రారంభించాడు.
నివేదికల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరుకి చెందిన 32 ఏళ్ల శివప్ప మొబైల్ సెలూన్ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గత సంవత్సరం లాక్డౌన్ వ్యాప్తి చెందడంతో రోజువారీ పనిని నమ్ముకున్న ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. అలాంటి వారిలో శివప్ప ఒకరు.
శివప్ప పదేళ్ల వయసులోనే రాయ్చూర్ నుంచి చిక్మంగళూరుకు వెళ్లారు. తరువాత అతి తక్కువ కాలంలోనే అతడు షేవింగ్ షాప్ ప్రారంభించాడు. కానీ కరోనా మహమ్మారి వల్ల అతని షాప్ మూసివేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏమి చేయాలో అతనికి పాలుపోలేదు.
మొబైల్ కూరగాయల షాప్ లాగా మొబైల్ సెలూన్ ప్రారంభించాలని అనుకున్నాడు. మొదట్లో ఇది సాధ్యమవుతుందా అని ఆలోచన కలిగింది, కానీ మొత్తానికి దీనిని అమలుచేసాడు. దీనికోసం ఒక చిన్న వస్తువుల ఆటోను కొనుగోలు చేసి మొబైల్ సెలూన్గా మార్చాడు.
వారు ఇప్పుడు వారు నివసించే ప్రాంతంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా తన సెలూన్ సర్వీస్ అందిస్తున్నారు. ఈ మొబైల్ సెలూన్ గురించి మాట్లాడుతూ, శివప్ప మరియు నేను మొదట్లో నెలకు రూ. 10,000 సంపాదించేవాన్ని, కానీ ఇప్పుడు రోజుకు రూ. 1,500 నుండి రూ. 2000 వరకు సంపాదిస్తున్నాని అతడు చెప్పాడు.
శివప్ప మొబైల్ సెలూన్ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా పాపులర్ అయ్యింది. చిక్మంగళూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు అందరికి శివప్ప మొబైల్ సెలూన్ బాగా తెలుసు. అంతే కాదు అతని ఫోన్ నంబర్ కూడా బాగా పరిచయం అయ్యింది. శివప్ప తన మొబైల్ సెలూన్కు మొబైల్ క్షౌరశాల అని పేరు పెట్టారు. ఏది ఏమైనా ఇది ఒక మంచి ఆలోచన.
NOTE:ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రెఫరెన్స్ కోసం మాత్రమే