Just In
- 12 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 14 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 15 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Movies Om Bheem Bush 7 Days Collection: శ్రీ విష్ణు మూవీకి ఊహించని వసూళ్లు.. వారంలో ఎన్ని కోట్లు వచ్చాయంటే!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పెట్రోల్ ధరలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు: బిజెపి మంత్రి
పెట్రోల్, డీజిల్ ధరలు నిరవధికంగా పెరగడంపై దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రతిపక్షాలు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా అధికం అవుతున్నాయి. అయితే, అధికార పక్షంలో ఉన్న కొందరు మాత్రం ఈ ధరల పెంపును సమర్థిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలపై తాజాగా బీహార్కి చెందిన బిజెపి మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలు సామాన్యుడిపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోవని బీహార్ మంత్రి, బిజెపి నాయకుడు నారాయణ ప్రసాద్ అన్నారు.
సామాన్య ప్రజలు బస్సుల్లో ప్రయాణిస్తారని, కొద్దిమంది మాత్రమే ప్రైవేట్ వాహనం ద్వారా ప్రయాణిస్తున్నారు కాబట్టి, ఈ ధరల పెంపు వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన అన్నారు.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!
దేశంలోని చాలా నగరాల్లో పెట్రోల్ ధర అత్యధికంగా లీటరుకు రూ.100 లకు దాటిపోయింది. వాస్తవానికి ఇంధన ధరలు పెరిగితే, దానిపై ఆధారపడిన ఇతర రవాణా చార్జీలు మరియు సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
నిజానికి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావరస సరుకుల ధరలు కూడా పెరగటం ప్రారంభించాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు ప్రధానిని నిందిస్తుంటే, ఇంధన ధరలపై నియంత్రణ ప్రభుత్వం చేతిలో లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు.
MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు
కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలు అనేకసార్లు పెరిగాయి. రెండు రోజుల అంతరాయం తరువాత, ఇంధన ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ప్రస్తుతం చాలా ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.90 దాటిపోయింది. మరికొన్ని నగరాల్లో రూ.100 కు చేరుకుంది. ఫిబ్రవరి 23న ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.90.97గా ఉంది.
గల్ఫ్ దేశాలు పెట్రోలియం ఉత్పత్తిని తగ్గిస్తున్నాయని, దీని కారణంగా దేశంలో పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఇంధన దిగుమతి అవసరాలలో 80 శాతం మాత్రమే తీర్చబడుతోందని, దీని కారణంగా డిమాండ్ మరియు సరఫరా సమన్వయం చేయబడలేదని ఆయన అన్నారు.
MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే
కాగా, పెట్రోల్ మరియు డీజిల్ ధరల ప్రభావం ప్రత్యక్షంగానే సామాన్యులపై పడుతోంది. ఇప్పటికే ముంబైలో ఆటోలు మరియు టాక్సీలు కిలోమీటరుకు 3 రూపాయల ఛార్జీని పెంచగా, రవాణాపై అధారపడిన సరుకులు ధరలు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
బిజెపి నాయకుడు నారాయణ ప్రసాద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం ప్రజలకు అలవాటైన విషయమేనని, ఇంధన ధరల విషయంలో కూడా వారు రాబోయే రోజుల్లో దీనిని అలవాటు చేసుకుంటారని అన్నారు. మరి ఈ మంతి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
MOST READ:వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!