Just In
- 1 hr ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 4 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 5 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 5 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఇకపై పేస్ మాస్క్ ధరించకుంటే కొత్త పనిష్మెంట్, అదేంటో చూసారా !
భారతదేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, లాక్ డౌన్ కి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మినహాయింపులు కల్పించాయి. మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మన దేశంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా లేదు.
కానీ ఎక్కువగా ప్రమాదం ఉన్న ప్రాంతాలలో వాహనాలు రైడింగ్ చేయడానికి అనేక ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు శిక్షలు విధించడం మరియు వాహనాలను స్వాధీనం చేసుకోవడం వంటి పలు చర్యలు తీసుకుంటున్నారు. అనవసరమైన వాహనదారులపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇలాంటి వాహనాలను ఇప్పటికీ పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు తమిళనాడులో 6 లక్షలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.
MOST READ:కూతుర్ని కారు షోరూమ్కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది
చాలా మంది వాహనదారులు ఇప్పటికి ఫేస్ మాస్క్ ధరించరు. ఫేస్ మాస్క్ ధరించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని కొంతవరకు నివారించవచ్చు. ఫేస్ మాస్క్ ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినప్పటికీ చాలా మంది వాహనదారులు దీనిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఫేస్ మాస్క్ ధరించని వారికి ఇప్పటివరకు జరిమానా విధించిన పోలీసులు ఇప్పుడు వేరే రకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్ పోలీసులు ఈ తరహా చర్యలు తీసుకుంటున్నారు.
MOST READ:స్క్రాప్ మెటీరియల్తో లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు
ఫేస్ మాస్క్ ధరించని వాహనదారులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ అని 500 సార్లు రాయాలి. ఫేస్ మాస్క్ ధరించని వారు పోలీసు అధికారులు, జిల్లా అధికారులు తీసుకున్న తరగతికి హాజరు కావాలి.
వాహనదారులు ఈ తరగతిలో 3 నుంచి 4 గంటల సమయం గడపాల్సి ఉంటుంది. దీని గురించి మాట్లాడిన అధికారులు ఫేస్ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసారు. ఇప్పుడు భారతదేశం వున్న కఠినమైన పరిస్థితుల్లో వాహనదారులు తప్పని సరిగా పేస్ మాస్క్ ధరించాలి అని చెప్పారు. ఈ ప్రత్యేకమైన చర్య వల్ల ప్రయోజనం ఉంటుందని పోలీసులు భావించారు. ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి. కారులో ప్రయాణించేటప్పుడు సీట్బెల్ట్ ధరించడం తప్పనిసరి.
MOST READ:లాక్డౌన్లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]
కరోనా వైరస్ ప్రస్తుతం అధికంగా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. బయటకు వెళ్ళే ముందు ఫేస్ మాస్క్ ధరించడం కూడా తప్పనిసరి. వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు ఫేస్ మాస్క్ ధరించడం చాలా అవసరం.
గమనిక : ఫోటోలు రిఫరెన్స్ కోసం మాత్రమే