Just In
- 1 hr ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 5 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 7 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 10 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరోనా ఎఫెక్ట్ : షేర్ ఆటోలు బంద్
ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కరోనా వైరస్ భారిన పడ్డాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలన్నింటిలోనూ వ్యాపించి అందరిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ వైరస్ భారిన పడిన చాలామంది ఇప్పటికే మరణించారు.
తుమ్మటం, దగ్గటం, వంటి లక్షణాలతో ఉన్న వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఈ వైరస్ చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ వైరస్ భారీ నుంచి తప్పంచుకోవడానికి ప్రపంచదేశాలన్ని ఎన్నో కఠినమైన చర్యలను తీసుకుంటోంది.
మన భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి జనతా కర్ఫ్యూ అమలు చేయడం వంటివి అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ వైరస్ బారినుంచి తప్పించుకోవడాని మరిన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి.
ఈ వైరస్ చాలా సులభంగా మరియు చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ తొందరగా వ్యాపించడం వల్ల మరణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ ప్రమాదకరమైన వైరస్ ని మొదట్లో చైనాలోని వూహాన్ లో కనుగొన్నారు.
ఈ వైరస్ ఇప్పటివరకు 170 కి పైగా దేశాలకు వ్యాపించింది. చైనా మరియు ఇటలీలో చాలా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 14,000 మందికి పైగా కరోనావైరస్ కారణంగా మరణించారు.
మార్చి 21 న ఇటలీలో 627 మంది మరణించారు. ఇటలీలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 4,825 కు పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
కరోనా ప్రభావం ఇటలీలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా తీవ్రతరం అవుతోంది. ఇప్పటివరకు చైనాలో 3,255 మంది, ఇరాన్లో 1,556, స్పెయిన్లో 1,378, ఫ్రాన్స్లో 562, అమెరికాలో 324 మంది మరణించారు. ఈ రేటు రోజురోజుకు పెరుగుతోంది.
భారతదేశంలో ఈ సంక్రమణ వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న జనతా కర్ఫ్యూ కోసం పిలుపునిచ్చారు. ఇది భారీ విజయాన్ని సాధించింది. దేశంలో కరోనా సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కర్ఫ్యూను ప్రారంభించారు.
ప్రజల సహకారం సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ప్రతిరోజూ కరోనా బారిన పడుతున్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో రైళ్లు, బస్సులు, రైళ్లు రద్దు చేయబడ్డాయి. ప్రజలు వెళ్ళకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి.
ఎల్లప్పుడూ బిజీగా ఉన్న నగరాలు ప్రజలు బయటకి రాకుండా ఉండటం వల్ల బోసిపోయాయి. ఈ విధంగా ఇర్వహించడం వల్ల వాహనాల రద్దీ లేకపోవడం వల్ల వాయు కాలుష్యం తక్కువగా ఉంటుంది. కరోనావైరస్ నివారణకు మహారాష్ట్రలోని థానే నగర అధికారులు చర్యలు తీసుకున్నారు.
థానే మునిసిపాలిటీ కొన్ని రోజులుగా షేర్ ఆటోలను నిషేధించింది. అంతే కాకుండా ఉబర్ మరియు ఓలా కూడా షేర్ రైడ్ను నిషేధించాయి. ఈ నిషేధం మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని చెబుతున్నారు. కరోనా వ్యాప్తి నుండి తీసుకున్న ఈ చర్య పేదలను బాధపెడుతుందని చెబుతారు.
కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపడానికి వేరే మార్గం లేదు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 60 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు.
మహారాష్ట్రలో ఇతర భారత రాష్ట్రాల కంటే కొరోనావైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా షేర్ ఆటోలు నిషేధించబడ్డాయి. మనదేశంలో ఆంద్రప్రదేశ్, తెలంగాణా వంటి రాష్ట్రాలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
గమనిక: ఈ చిత్రాలు కేవలం సూచన కోసం మాత్రమే