Just In
- 14 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 16 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 16 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 18 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Movies Guppedantha Manasu April 18th: కాలేజీ నుంచి వెళ్లిపోయిన మహేంద్ర.. మను దత్తత.. టెన్షన్లో దేవయాని!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నవీన్ పట్నాయక్ నిర్ణయం, అదేంటో తెలుసా.. ?
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడమే కాకుండా భారతదేశంలో కూడా ఎక్కువ ప్రమాదకారిగా మారింది. ప్రపంచంలోని పెద్ద దేశాలు కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించలేకపోతున్నాయి.
వైద్య రంగంలోని అభివృద్ధి చెందిన దేశాలలో కూడా వైద్య పరికరాల కొరత ఉంది. వెంటిలేటర్లు మరియు మాస్కుల కొరత కూడా ఉంది. భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.
ఇందులో భాగంగా భారతదేశంలో 21 రోజుల లాక్డౌన్ అమలు చేయబడింది. ఏప్రిల్ 14 వరకు అమల్లోకి వచ్చే లాక్డౌన్ వ్యవధి మరింత పొడిగిస్తూ దానిని ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పెంచారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
MOST READ: ఏడు రోజులుగా కారులోనే నిద్రించిన డాక్టర్, ఎందుకో తెలుసా.. ?
కానీ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించకముందే లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. దీనితో ఒడిశా లాక్డౌన్ పొడిగించి భారతదేశంలో విస్తరించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది.
కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వం వివిధ కఠినమైన చర్యలు తీసుకుంటోంది.
ఒడిశాలో 48 మందికి కరోనా వైరస్ సోకింది ఒకరు మరణిస్తే, ఇద్దరు కోలుకున్నారు. కరోనా వైరస్ ను నివారించడానికి ఉత్తమ మార్గం తమను తాము వేరుచేయడం. ఈ వ్యాధికి ఇప్పటిదాకా సరైన అధికారిక చికిత్స లేదు.
MOST READ: లాక్డౌన్ లో బయటికి వచ్చిన క్రికెటర్ కి జరిమానా, ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?
14 రోజుల పాటు సామాజిక దూరం పాటించిన తరువాత వారికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం 15 వ రోజు 15 వేల రూపాయల సహాయం చేయడమే కాకుండా, అంతే కాకుండా ఒడిశా ప్రభుత్వం 4 నెలలు బియ్యం కూడా ఇచ్చింది. అదనంగా ఇది పెన్షనర్లు మరియు భవన నిర్మాణ కార్మికులకు సహాయం చేశారు.
అవసరమైన పనుల కోసం ప్రజలు ఇంటి నుండి బయలుదేరాల్సి వస్తే మాస్కు ధరించడం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నారు.
MOST READ: టాటా సఫారీ & నానో కార్ అమ్మకాలను నిలిపివేసిన టాటా మోటార్స్, ఎందుకంటే.. ?
ఒరిస్సా రాష్ట్రంలో ఈ నిబంధనను మొదటి మూడు సార్లు ఉల్లంఘిస్తే ఒక్కొక్కరికి రూ. 200 జరిమానా విధించబడుతుంది. తరువాత కూడా ఉల్లంఘించినట్లైతే 500 జరిమానా విధించబడుతుంది. ఈ నిబంధనను అందరూ పాటించాలని ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఒడిశాలోని పెట్రోలియం బంకర్లు కొత్త ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా మాస్కులు ధరించని వాహనదారులకు మాత్రమే పెట్రోల్ మరియు డీజిల్ విక్రయించడం లేదు.
MOST READ: కారు కొనడానికి ముందు ఏం చేయాలో తెలుసా.. !
ఒడిశాలోని అన్ని పెట్రోల్ బంకర్లలో ఈ పథకం అమలు చేయబడింది. ఈ చర్యకు ప్రశంసలు కూడా లభించాయి. ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,600 పెట్రోల్ బంకర్లు ఉన్నాయి. ఈ పథకం అన్ని బంకర్లలో అమలు చేయబడింది.
పెట్రోల్ బంకర్లు ఈ నిబంధనలను పాటించాలని ప్రజలకు చెప్పారు. లాక్ డౌన్ లో ఉన్నప్పుడు కూడా వాహనదారులకు పెట్రోల్ డీజిల్ వంటివి చాలా అవసరం. పెట్రోల్ బంకర్ల ఉద్యోగులు కూడా కరోనా భద్రతా చర్యలను అనుసరిస్తున్నారు.
పెట్రోల్ మాత్రమే కాదు, కిరాణా దుకాణాల యజమానులు కూడా మాస్క్ ధరించాలని వినియోగదారులకు సూచించారు. లేకపోతే నిత్యావసర సరుకులు అమ్మబడవు.
ఒడిశా రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో చాలా ప్రమాదాలని ఎదుర్కొంది. ఈ విధంగా విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఒడిశాకు ఎక్కువ అనుభవం ఉంది. కరోనా వైరస్ సంక్రమణను ఎదుర్కోవడానికి కూడా ఈ అనుభవం ఒడిశాకు సహాయపడుతుంది.