Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కూతుర్ని కారు షోరూమ్కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది
తల్లి దండ్రులు పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. లేకుంటే పిల్లల వల్ల జరిగే కొన్ని అనుకోను సంఘటనలకు తల్లి దండ్రులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.
చైనాలోని గుయిలిన్ ప్రాంతంలో ఒక జంట ఇటీవల తమ 3 సంవత్సరాల కుమార్తెను ఆడి కారు షోరూమ్కి తీసుకెళ్లారు. వారు ప్రదర్శనలో ఉన్న కార్ల చుట్టూ చూస్తున్నారు. వారి 3 ఏళ్ల కూతురు ఆ షోరూమ్ సమీపంలో తిరుగుతూ ఉంది. అప్పటికే ఆ చిన్న పిల్ల చేతిలో రాయి ఉండటాన్ని ఆ తల్లి దండ్రులు గమనించుకోలేదు.
ఆ చిన్న పిల్ల షోరూం చుట్టూ షికారు చేస్తూ తన వెంట ఉన్న రాయితో కార్లపై గీసింది. ఏకంగా ఆ పిల్ల 10 కార్లపై ఆ రాయితో గీసింది. ఇది గమనించిన తల్లిదండ్రులకు నోటమాట రాకుండా పోయింది. అప్పుడు వారికి ఏమి చేయాలో తెలియక భయానక పరిస్థితిలో ఉండిపోయారు.
MOST READ:స్క్రాప్ మెటీరియల్తో లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు
ఈ సంఘటన చూసిన డీలర్ ఆ తల్లిదండ్రలను ఆ చిన్న పిల్ల చేసిన పొరపాటుకు ఏకంగా 200,000 యువాన్ల (సుమారు $ 29,000) పరిహారం చెల్లించాలని చెప్పారు. ఇది సుమారు ఇండియన్ కరెన్సీ ప్రకారం 22 లక్షలు. ఆ తల్లిదండ్రులు అంత మొత్తాన్ని చెల్లించలేమని తిరస్కరించారు.
ఈ సమస్య అక్కడ పరిస్కారం కాకపోవడంతో వారు కోర్టుని ఆశ్రయించారు. అయితే కార్ల డీలర్ మంచి కార్లు దెబ్బతిన్నాయని వాదించారు. కొత్త కార్లపై గీతలు గీయడం వల్ల గీతలు మూసివేయడానికి పెయింట్ వేసినప్పటికీ కూడా ఎప్పటిలాగా కొత్త కార్లలాగా అమ్మలేమని తెలిపారు. ఈ కారణంగా కార్లను తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తుంది. దీని వలన అతని కంపెనీకి భారీ నష్టం జరుగుతుంది.
MOST READ:టైర్ల దిగుమతిపై ప్రభుత్వ ఆంక్షలు; స్థానిక తయారీకే మద్దతు!
ఈ సమస్యను రెండు పార్టీలు పరిష్కరించాయి మరియు కారు డీలర్ నిర్ణయించిన విధంగా తల్లిదండ్రులు 70,000 యువాన్ ($ 10,000) చెల్లించడానికి అంగీకరించారు. పిల్లలను బయటికి తీసుకువెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వారిని కోర్టు హెచ్చరించింది.
ఏది ఏమైనా ఆ చిన్న పిల్ల వల్ల కంపెనీకి చాలా నష్టం కలిగింది. కారుపై గీతాలు పెట్టడం వల్ల ఆ దంపతులపై కేసుపెట్టాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఎందుకంటే లగ్జరీ కారు చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. వీటికి ఏ చిన్న లోపం ఏర్పడినప్పటికీ సరైన ధరకు విక్రయించలేరు. ఈ విధంగా జరిగితే కంపెనీ చాలా నేస్తాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. తల్లి దండ్రులు పిల్లలని ఎప్పుడు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి లేకుండా ఇలాంటి సంఘటనలే జరిగే అవకాశం ఉంటుంది.