Just In
- 6 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 7 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 8 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 8 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Movies విడాకులు దిశగా మరో స్టార్ కపుల్.. ఇండస్ట్రీలో షాకింగ్గా..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లాక్డౌన్ లో జరిగిన పెళ్లి : రాయల్ ఎన్ఫీల్డ్ పై రైడింగ్
కరోనా వైరస్ అధికంగా విస్తరిస్తున్న కారణంగా భారతదేశంలో ప్రస్తుతం రెండవదశ లాక్ డౌన్ కొనసాగుతోంది. దాదాపు భారతదేశంలో లాక్ డౌన్ నెలరోజులు దాటింది. ఈ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ చాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ కరోనా మహమ్మారి మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ సమయంలో వేడుకలు, పండుగలు ఇతర కార్యక్రమాలు అన్నీ రద్దు చేయబడ్డాయి. అంతే కాకుండా వివాహాది శుభకార్యాలు కూడా వాయిదా పడుతున్నాయి.
కరోనా మహమ్మారి వల్ల అక్కడక్కడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా కొన్ని వివాహాలు జరుగుతున్నాయి. ఇందులో కూడా ఎక్కువమంది బంధువులు కూడా హాజరుకాకుండా శ్రద్ధ తీసుకుంటున్నారు. స్నేహితులు మరియు బంధువులు లేకుండానే ప్రజలు చాలా సింపుల్ పద్ధతిలో వివాహం చేసుకుంటున్నారు. పంజాబ్లో ఇలాంటి వివాహమే ఒకటి జరిగింది. దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వివాహితులు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఆలయం నుండి ఇంటికి వెళతారు. పంజాబ్ పోలీసులు బైక్ను ఆపి కొత్త జంటను పరిశీలించారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
MOST READ:లాక్డౌన్ లో తల్లిని చూడటానికి 480 కి.మీ సైకిల్ పై వచ్చిన కొడుకు, చివరికి ఏమైందంటే
ఆ వధూవరులు ఆలయంలో వివాహం చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. ఇది తెలుసుకున్న పోలీసులు వారికి పువ్వులు, స్వీట్లు ఇవ్వడం మనం ఈ వీడియోలో చూడవచ్చు.
సాధారణ వివాహం చేసుకోవడానికి నగర పోలీసుల నుండి అవసరమైన అనుమతి లభించిందని ఈ జంట చెప్పారు. అతని వివాహానికి కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు.
MOST READ:రిషి కపూర్ మరణం : లాక్డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్
ఉత్తర భారతదేశంలో వివాహాలు ముఖ్యంగా చాలా వరకు పంజాబీ తరహా వివాహాలు జరుగుతున్నాయి. ఇటువంటి వివాహాలు చాలా కోలాహలంగా ఉంటాయి. స్నేహితులు మరియు బంధువులు దూరం నుండి వివాహాలకు వస్తారు. ఈ నేపథ్యంలో వివాహం చాలా రోజులు పెద్ద పండగలాగా జరుగుతుంది.
ఈ వీడియోలో మనం గమనించినట్లయితే నూతన వధూవరులు వారి వివాహ వస్త్రధారణలో ఉన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై ఇంటికి తిరిగి వస్తున్నారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన తరువాత వారు వెళ్ళడానికి అనుమతించారు.
Image Courtesy: India Exclusive/YouTube
MOST READ:కరోనా ఎఫెక్ట్ : విమానాశ్రయాల్లో ఆంటిసెప్టిక్ రోబోట్స్