Just In
- 37 min ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 3 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 5 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 6 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
Don't Miss
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
1200 కి.మీ తన తండ్రిని సైకిల్ పై తీసుకువచ్చిన 15 ఏళ్ల అమ్మాయి
భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించిన కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ విధంగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల సుదూరప్రాంతాలలో ఉండే వలస కూలీలు వారి స్వస్థలాలకు చేరుకోలేకపోయారు. కానీ కొంతమంది లాక్ డౌన్ తరువాత వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. రవాణా సౌకర్యాలు లేనందున ప్రజలు తమ సొంత రవాణా వ్యవస్థల ద్వారా తమ స్వస్థలాలకు తరలివస్తున్నారు.
లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా నిలిపివేయబడింది. వలస కార్మికులను తిరిగి వారి ఇళ్లకు తీసుకురావడానికి ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశారు. కానీ ప్రతి ఒక్కరూ దీనిని పొందడం లేదు. ఈ సదుపాయాన్ని పొందలేకపోతున్న పేద వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తరలివస్తున్నారు.
ఇదే నేపథ్యంలో బీహార్ కి చెందిన 15 ఏళ్ల బాలిక తన అనారోగ్య తండ్రిని దర్భంగా నుంచి ఢిల్లీ వరకు సైకిల్ పై తీసుకువచ్చింది. కోవిడ్-19 వైరస్ ఆమె తండ్రి జీవనోపాధి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి కాలికి గాయమైంది. కాబట్టి అతడు నడవలేకపోయాడు. ఈ కారణంగా ఆమె తన తండ్రిని సైకిల్పై తీసుకువచ్చింది.
MOST READ:ఇది మాడిఫైడ్ టయోటా అంబులెన్స్.. చూసారా !
జ్యోతి అనే 15 ఏళ్ల అమ్మాయి తన తండ్రిని తిరిగి తన సైకిల్కు స్వస్థలానిఊరికి తీసుకు వచ్చింది. తండ్రి కుమార్తె మే 10 న దర్భంగా నుండి బయలుదేరారు. మొదట వారు బస్సులో ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు మరియు బస్ స్టాప్ చేరుకున్నారు. కానీ బస్సు ఛార్జీలను 6000 రూపాయలుగా నిర్ణయించారు. కానీ వారి వద్ద 600 మాత్రమే ఉన్నాయి.
జ్యోతి 500 రూపాయలకు ఒక సైకిల్ కొనుక్కుంది. అప్పుడు ఆమెకు 100 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆమె తన తదుపరి పర్యటన కోసం ఈ డబ్బును ఆదా చేసింది. ఆమె మరియు ఆమె తండ్రి హైవేలో పగలు మరియు రాత్రి ప్రయాణించారు.
MOST READ:ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏంజరుగుతోందో తెలుసా.. అయితే ఇది చూడండి
దీని గురించి మాట్లాడుతూ, వందలాది మంది కార్మికులు హైవేపై ప్రయాణించేటప్పుడు భయమేమీ లేదు కానీ వెనుక నుంచి వాహనాలు డీ కొంతాయేమో అని బయమేసింది చెప్పింది. ఈ ప్రయాణంలో వారు అక్కడక్కడా 2 - 3 గంటలు విశ్రాంతి తీసుకున్నారు.
వారు ప్రయాణించే సమయంలో సహాయక శిబిరాలలో భోజనం చేసారు. తండ్రి-కుమార్తె యొక్క ఈ ప్రయాణం గురించి తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
MOST READ:మద్యం మత్తులో బైక్ నుంచి కొడుకుని కిందపడేసిన తండ్రి [వీడియో]
ఈ అమ్మాయికి సహాయం చేయడానికి ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు. సైక్లింగ్ సమాఖ్య కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. లాక్ డౌన్ నేపధ్యంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇంత సాహసం చేసిన జ్యోతికి సైక్లింగ్ సమాఖ్య కూడా ఆహ్వానం పలికింది.