కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రపంచంలోని వివిధ దేశాలలో లాక్ డౌన్ అమలు చేయబడింది. భారతదేశంలో కూడా రెండవ దశ లాక్ డౌన్ 2020 మే 3 వరకు అమలు చేయబడింది. లాక్ డౌన్ నేపథ్యంలో భాగంగా దాదాపు అన్ని రకాల రవాణా సేవలను రద్దు చేయబడ్డాయి. అంతే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇల్లు దాటి బయటకి రాకూడదని ఆంక్షలు కూడా విధించారు.

కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

లాక్ డౌన్ ఫలితంగా ఎల్లప్పుడూ గజి బిజిగా ఉండే రోడ్లు ప్రజలు లేకుండా నిర్మానుష్యంగా మారిపోయాయి. రవాణా సేవలను రద్దు చేయడం వల్ల బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేక అక్కడే ఉండిపోవాల్సి పరిస్థితి ఏర్పడింది. కానీ కొంతమంది తమ సొంత గ్రామాలకు వెళ్ళడానికి కాలినడకన మరియు సైకిల్స్ లో వెళ్ళడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి సంఘటన తమిళనాడులో జరిగింది.

కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

బస్సులు లేనందున ఒక యువకుడు మదురై నుండి తేని వరకు సైకిల్ ద్వారా ప్రయాణించాడు. కార్లలో మరియు బైకులలో ప్రయాణిస్తున్న యువకుల మధ్య సైకిల్‌పై 85 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ యువకుడి కథ ఇక్కడ చూద్దాం.

కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

ముత్తు మరియు తమిళానికి, జీవరాజ్ అనే కుమారుడు, ఒక కుమార్తె ప్రవీణ ఉన్నారు. జీవరాజ్ వయసు 22, ప్రవీణ వయసు 20 సంవత్సరాలు. వీరి తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు. ఇప్పుడు వారి తల్లే తమ పిల్లలను చూసుకుంటున్నారు.

కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

జీవరాజ్ ఒక ప్రైవేట్ పాఠశాలలో క్లీనర్‌గా పనిచేస్తాడు. ప్రవీణ తేని ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. తమిళనాడులో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ తల్లి తమ కుమారుడు జివరాజ్‌తో తన కుమార్తె ప్రవీణను ఇంటికి తీసుకురావాలని చెప్పారు.

కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

బస్సులు మరియు ఇతర వాహన సేవలు లేకపోవడంతో జీవరాజ్ తన సోదరిని సైకిల్‌పై తీసుకురావడానికి బయలుదేరాడు. జీవరాజ్ అతనితో పాటు ఒక ఎయిర్‌పంప్‌ను మాత్రమే వెంట తీసుకెళ్లాడు.

కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

మదురై నుండి సైకిల్ ద్వారా 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేని చేరుకున్న తరువాత, ప్రవీణ పనిచేసే ఆసుపత్రికి చేరుకున్నాడు. ప్రవీణను తీసుకెళ్లడానికి ఆమె అన్నయ్య సైకిల్‌పై వచ్చాడని విన్న ఆసుపత్రి సిబ్బంది షాక్ అయ్యారు.

కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

ఆసుపత్రి పాలకమండలి సైకిల్‌ను మదురైకి తిరిగి రావడానికి అనుమతించలేదు. ఆసుపత్రి పాలకమండలి జిల్లా నుంచి అనుమతి కోరుతోంది. ఈ లోపు కొంతమంది సామాజిక కార్యకర్తలు జీవరాజ్ కి మరియు అతని సోదరి కోసం కారు ఇచ్చారు. ఈ కారులోనే అన్నా సోదరి మదురై చేరుకున్నారు.

కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. దీని గురించి జివరాజ్ మాట్లాడుతూ, తాను ప్రయాణిస్తున్న సైకిల్ రెండు టైర్లు దెబ్బతిన్నాయి. ఒక కి.మీ తరువాత సైకిల్ టైర్ గాలి మొత్తం పోవడం వల్ల మరియు టైర్లలో గాలి తరచుగా పడిపోయిందనే కారణంతో నేను ఉదయం మదురై నుండి బయలుదేరాను కానీ నేను తేనిలో చేరినప్పుడు రాత్రి అయిందని చెప్పాడు.

కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

ఆసుపత్రికి వచ్చిన తరువాత అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు తన సోదరిని చూడటానికి వచ్చాడని చెప్పాడు. భద్రతా సిబ్బంది రాత్రి కావడం వల్ల మరుసటి రోజు ఉదయం కలుసుకోవడానికి అనుమతిచ్చారు. ఆ రాత్రి జీవరాజ్ ఆసుపత్రి ప్రాంగణంలో పడుకున్నట్లు చెప్పారు.

కరోనా లాక్‌డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న

లాక్ డౌన్ సమయంలో సరిగా పనిచేయని సైకిల్ పై 85 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ప్రయాణించిన జీవరాజ్ కథ తమిళనాడు అంతటా ఒక వార్తలాగా నిలిచిపోయింది. ఏది ఏమైనా అన్న చెల్లెలి అనుబంధం చాలా మధురంగా ఉంటుందనే చెప్పాలి. ఎట్టకేలకు జీవరాజ్ తన సోదరిని ఇంటికి తీసుకెళ్లాడు.

More from DriveSpark

Article Published On: Thursday, April 23, 2020, 10:48 [IST]
English summary
Covid-19 Lockdown: Brother Cycles 85 KM From Madurai To Theni To Bring Back Sister. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+