Just In
- 2 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 5 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 7 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 11 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం, ఎక్కడో తెలుసా..?
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇప్పుడు లాక్ డౌన్ అమలు చేయబడింది. దీనివల్ల ప్రజలు తమ ఇళ్లను విడిచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. చాలా మందికి ఆదాయం లేకుండా కష్టాల్లో ఉన్నారు.
భారతదేశంలో కూడా ఆర్ధిక పరిస్థితి దెబ్బతినింది. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి 21 రోజుల లాక్డౌన్ ప్రకటించారు. దీనివల్ల అన్ని ప్రజా రవాణా సేవలు రద్దు చేయబడ్డాయి. అదనంగా ఆటో, టాక్సీ మరియు ఎలక్ట్రిక్ రిక్షాలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పాడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
కరోనా వైరస్ కారణంగా ప్రజలు తమ ఇళ్లను విడిచి బయటికి రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా ప్రజలు తమ ఇళ్లనుండి బయటికి వెళ్లడం లేదు. ఆటో, టాక్సీ, ఎలక్ట్రిక్ రిక్షాలను నమ్ముకుని జీవిస్తున్న వారి చాల ఇబ్బదుల్లో పడ్డారు.
ఈ వాహనాల నుండి రోజువారీ ఆదాయాన్ని సంపాదించే వారి పరిస్థితి చాలా వరకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వారికి సహాయం చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు సహాయం చేయడానికి వచ్చాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ బాటలో ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 35,000 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది.
పేద ప్రజలకు మాత్రమే కాకుండా ఆటో, టాక్సీ, ఎలక్ట్రిక్ రిక్షా డ్రైవర్లకు కూడా 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి తమ వంతు సాయంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకుంది.
దీని గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఎవరూ ఆకలితో ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆటో, టాక్సీ, ఎలక్ట్రిక్ రిక్షా డ్రైవర్లకు వచ్చే 7 నుంచి 10 రోజుల్లో రాయితీలు చెల్లించబడతాయి అని కూడా ప్రస్తావించారు.
ప్రజా రవాణా వాహనాలు పూర్తిగా నిలిపివేయడం వల్ల భారతదేశంలో దాదాపు అన్ని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈ సందర్భంలో కూడా కొంత మంది ఈ లాక్ డౌన్ కి వ్యతిరేకంగా రోడ్లపై తిరుగుతున్నారు. ఇది చట్ట విరుద్ధమైన చర్య. ఇప్పటి పరిస్థితుల్లో ఈ విధంగా చేయడం ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విధంగా చేయడం వల్ల కరోనా వైరస్ భారిన పడే అవకాశం ఉంది. కేవలం ఆ వ్యక్తి మాత్రమే కాకుండా అతని కుటుంబం కూడా ఈ వైరస్ ప్రభావానికి లోను కావాల్సిందే.
లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చే వారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నారు. ఇప్పటికే చాల వాహనాలను సీజ్ చేయడం జరిగింది, అంతే కాకుండా చాల మందిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది.
ఏది ఏమైనా ప్రజలు ఈ లాక్ డౌన్ కి తమ వంతు మద్దతు తెలిపాలి. ఇంక ఈ లాక్ డౌన్ పరిమితి కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికైనా మనకోసం ఇంతగా కష్టపడుతున్న ప్రభుత్వానికి మనవంతు మద్దతుగా ఇంట్లోనే ఉండాలి.