Just In
- 54 min ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 2 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 3 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 4 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
Don't Miss
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Movies Tillu Square: శ్రీలీల సహా అనుపమ క్యారెక్టర్ మిస్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా?
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కరోనా లాక్డౌన్ వల్ల సైకిల్ పై స్వగ్రామం చేరిన కార్మికులు, ఎక్కడో తెలుసా..?
కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రపంచంలోని అనేక దేశాలలో లాక్డౌన్ అమలు చేయబడింది.భారతదేశంలో కూడా లాక్ డౌన్ లోనే ఉంది. దీనివల్ల చాల వరకు ఆటో పరిశ్రమల మరియు ఇతర రంగాల వారి వ్యాపార లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి.
భారతదేశంలో లాక్ డౌన్ మొదటిసారి ఏప్రిల్ 14 వరకు అమలు చేయబడింది. మార్చి 23 రాత్రి ఈ లాక్ డౌన్ ప్రకటన ప్రకటించారు. లాక్డౌన్ మార్చి 24 నుండి అమల్లోకి వచ్చినప్పటి నుండి, ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తమ ఇళ్లకు తిరిగి రావడం ప్రారంభించారు. ఈ లాక్ డౌన్ వల్ల దూర ప్రాంతాలలో ఉండే చాలామంది తమ స్వగ్రామాలకు రావడానికి వీలుపడలేదు.
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా చాలామంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. కార్మికులు పని కోల్పోవడం వల్ల తినటానికి తిండి కూడా కరువైపోయింది. కాబట్టి ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో వారు ఆహారం లేకుండా వారి స్వగ్రామాలకు తిరిగి రావడం ప్రారంభించారు.
MOST READ: ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా..?
లాక్డౌన్ కారణంగా బస్సులు మరియు ట్రైన్ సర్వీసులు కూడా రద్దు చేయబడ్డాయి. దీంతో కొందరు ఇంటికి వెళ్ళడానికి నడవడానికి ఎంచుకున్నారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్ళడానికి కాలినడకనే ప్రయాణించారు. మరి కొంతమంది సైకిల్ ద్వారా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించారు.
ఒడిస్సాకి చెందిన ఒక యువకుడు ముంబై నుండి దాదాపు 1,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సైకిల్ ద్వారా తన స్వగ్రామానికి చేరుకున్నాడు. రవాణా సౌకర్యాలు లేని కారణంగా కార్మికులు తమ స్వగ్రామాలకు చేరుకోవడం చాలా కష్టం.
MOST READ: ట్రక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన NHAI, అదేంటో ఇప్పుడే చూడండి
భారతదేశంలో ఏప్రిల్ 14 వరకు అమలు చేసిన లాక్డౌన్ను కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తున్న కారణంగా 2020 మే 3 వరకు పొడిగించారు. దీనివల్ల ఆందోళన చెందుతున్న కార్మికులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. బస్సులు, ట్రైన్లు లేనందున ప్రజలు సైకిల్లో ప్రయాణిస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులు సైకిల్ ద్వారా తమ సొంత రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుండి ప్రయాణం ప్రారంభించిన కార్మికులు దీని గురించి మాట్లాడుతూ వారు ఐదు రోజులు ప్రయాణించినట్లు తెలిపారు.
MOST READ: కరోనా వేళ ప్రజలను నియంత్రించడానికి మేము సైతం అంటున్న మహిళా పోలీసులు, ఎక్కడో తెలుసా..?
కార్మికులు తమ స్వగ్రామం చేరుకోవడానికి సుమారు 6 రోజులు పడుతుందన్నారు. లాక్ డౌన్ ఏప్రిల్ 14 తో ముగుస్తుందని మేము భావించాము. మళ్ళీ ఈ లాక్ డౌన్ పొడిగించడం వల్ల తాము తమ స్వగ్రామాలకు రికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. రవాణా సౌకర్యాలు అందుబాటులో లేనందున మేము సైకిల్కు వెళ్తున్నాము.
కొంతమంది కార్మికులు మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి మధ్యప్రదేశ్కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి మాట్లాడుతూ, ఒక మహిళ, తానూ, తన భర్త మరియు మా ఒక సంవత్సరం పిల్లవాడు సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్నాము. రవాణా సౌకర్యాలు లేనందున తాము సైకిళ్లపై తిరిగి వస్తున్నామని మధ్యప్రదేశ్కు చెందిన సియోని చెప్పారు.
కోవిడ్ -19 వైరస్ చాలా మంది కార్మికుల జీవితాలను నాశనం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి కార్మికులకు వారికీ సహాయం చేసి సమస్యలు వీలైనంత తొందరగా పరిష్కరిస్తాయని భావిస్తున్నారు.