ముంబైలో లాక్డౌన్ ఉల్లంఘించిన వాహనాలకు విధించిన జరిమానా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ లాక్ డౌన్ మార్చి 24 నుండి అమలులోకి వచ్చింది. మనదేశంలో ఇప్పటికి లాక్ డౌన్ మొదటి మరియు రెండవ దశలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడవదశ లాక్ డౌన్ మే 17 వరకు ఉంటుంది. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ఆంక్షలు విధించారు.

భారతదేశంలో అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ఆదేశించారు. కానీ అనవసరంగా బయటకు వచ్చిన వాహనాలను సీజ్ చేయడమే కాకుండా వారికీ కఠినమైన శిక్షలు కూడా విధిస్తున్నారు. అంతే కాకుండా కొంతమందికి జరిమానాలు కూడా విధిస్తున్నారు.

తమిళనాడులో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 3.50 లక్షలకు పైగా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ముంబైలోని పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు.

ముంబైలో లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుండి దాదాపు 9 కోట్ల రూపాయల జరిమానా విధించబడింది. హెల్మెట్ ధరించనందుకు 73,735 ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించారు.

లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 36,248 మందికి జరిమానా విధించారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న మొత్తం 11,611 మందికి, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న 6,354 మందికి జరిమానా విధించారు.

మొత్తం మీద 2,09,188 మందికి జరిమానా విధించారు. ముంబై నగరంలో కరోనా వైరస్ ఎక్కువగా ప్రభావితమవుతుంది. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ముంబై హాట్ స్పాట్ గా మారింది.

కరోనా రోజు రోజుకి ఎక్కువవుతుంటే ఇంకా ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ముంబై నగరంలో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. మార్చి 23 నుంచి మే 12 వరకు ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 18 మంది మరణించారు.

లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కోవిడ్ -19 వైరస్ సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి లాక్ డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు కల్పించబడ్డాయి. అవసరమైతే మాత్రమే వాహనాల నుండి బయటికిరావాలి. అనవసరంగా ప్రజలు బయటికి వస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.
ఏది ఏమైనా ఈ కరోనా పరిస్థితులను ఎదుర్కోవడానికి వీలైనంతవరకు ఇళ్లలో ఉండటం మంచిది. ఒక వేళ బయట తిరగవలసి పరిస్థితి ఏర్పడితే తప్పని సరిగా సామాజిక దూరంగా పాటించాలి.


Click it and Unblock the Notifications








