Just In
- 9 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 9 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 10 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 11 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ముంబైలో లాక్డౌన్ ఉల్లంఘించిన వాహనాలకు విధించిన జరిమానా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ లాక్ డౌన్ మార్చి 24 నుండి అమలులోకి వచ్చింది. మనదేశంలో ఇప్పటికి లాక్ డౌన్ మొదటి మరియు రెండవ దశలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడవదశ లాక్ డౌన్ మే 17 వరకు ఉంటుంది. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ఆంక్షలు విధించారు.
భారతదేశంలో అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ఆదేశించారు. కానీ అనవసరంగా బయటకు వచ్చిన వాహనాలను సీజ్ చేయడమే కాకుండా వారికీ కఠినమైన శిక్షలు కూడా విధిస్తున్నారు. అంతే కాకుండా కొంతమందికి జరిమానాలు కూడా విధిస్తున్నారు.
తమిళనాడులో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 3.50 లక్షలకు పైగా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ముంబైలోని పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు.
MOST READ:ఎలంట్రా ‘ఎస్' వేరియంట్ నిలిపివేసిన హ్యుందాయ్, ఎందుకో తెలుసా
ముంబైలో లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుండి దాదాపు 9 కోట్ల రూపాయల జరిమానా విధించబడింది. హెల్మెట్ ధరించనందుకు 73,735 ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించారు.
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 36,248 మందికి జరిమానా విధించారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న మొత్తం 11,611 మందికి, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న 6,354 మందికి జరిమానా విధించారు.
MOST READ:విడుదలకు సిద్దమైన న్యూ హ్యుందాయ్ ఐ 20 కార్, లాంచ్ ఎప్పుడో తెలుసా
మొత్తం మీద 2,09,188 మందికి జరిమానా విధించారు. ముంబై నగరంలో కరోనా వైరస్ ఎక్కువగా ప్రభావితమవుతుంది. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ముంబై హాట్ స్పాట్ గా మారింది.
కరోనా రోజు రోజుకి ఎక్కువవుతుంటే ఇంకా ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ముంబై నగరంలో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. మార్చి 23 నుంచి మే 12 వరకు ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 18 మంది మరణించారు.
MOST READ:టికెట్ బుకింగ్స్ రద్దు చేసిన ఇండియన్ రైల్వే, ఎందుకో తెలుసా ?
లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కోవిడ్ -19 వైరస్ సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి లాక్ డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు కల్పించబడ్డాయి. అవసరమైతే మాత్రమే వాహనాల నుండి బయటికిరావాలి. అనవసరంగా ప్రజలు బయటికి వస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.
ఏది ఏమైనా ఈ కరోనా పరిస్థితులను ఎదుర్కోవడానికి వీలైనంతవరకు ఇళ్లలో ఉండటం మంచిది. ఒక వేళ బయట తిరగవలసి పరిస్థితి ఏర్పడితే తప్పని సరిగా సామాజిక దూరంగా పాటించాలి.