Just In
- 33 min ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 1 hr ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 2 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 3 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
Don't Miss
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Movies Tillu Square Business: సిద్దు మూవీకి రికార్డు బిజినెస్.. ఆ హీరోలతో సమానంగా.. టిల్లు 2 హిట్ కావాలంటే!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భారీగా తగ్గిన పెట్రోల్ & డీజిల్ అమ్మకాలు, ఎందుకో తెలుసా.. ?
భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందు వల్ల దీనిని నివారించడానికి 21 రోజుల లాక్ డౌన్ అమలు చేయబడింది. ఈ కారణంగా వాహన సేవలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. ఇప్పుడు వాహనాల రాకపోకలు లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
వాహనాల వినియోగం లేకపోవడం వల్ల వాతావరణంలో గాలి కలుషితం కాకుండా ఉంటుంది. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మార్చిలో పెట్రోల్ అమ్మకాలు 15.5% పడిపోయాయి.
ఈ ఏడాది మార్చిలో 1.859 మిలియన్ టన్నుల పెట్రోల్ అమ్ముడైంది. మార్చి 2019 లో 2.2 మిలియన్ టన్నుల పెట్రోల్ అమ్ముడైంది. భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించిన ఇంధన డీజిల్ అమ్మకాలు కూడా 24.2% పడిపోయాయి. మార్చిలో మాత్రమే 4.8 మిలియన్ టన్నుల డీజిల్ అమ్ముడైంది.
పెట్రోల్ మరియు డీజిల్ మాత్రమే కాకుండా అదనంగా ఏవియేషన్ టర్బైన్ ఇంధనం యొక్క ఎటిఎఫ్ అమ్మకాలు కూడా 31% పడిపోయాయి. విమానాలను సేవలు కూడా రద్దు చేయడంతో టర్బైన్ ఇంధన అమ్మకాలు తగ్గాయి.
ఏప్రిల్ నెలలో కూడా ఇంధన అమ్మకాలు కొనసాగే అవకాశం లేదు. దీనికి ప్రధాన కారణం ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. లాక్డౌన్ మరింత రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఏప్రిల్లో ఇంధన అమ్మకాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
భారతదేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలో చిక్కుకున్నారు. అనవసరంగా బయట తిరిగే వాహనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల వాహనాల రద్దీ తగ్గింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గాయి.
సాధారణంగా పెట్రోల్, డీజిల్ ఎక్కువగా ఉపయోగించే దేశాలలో భారతదేశం ఒకటి. కానీ లాక్ డౌన్ కారణంగా, పెట్రోల్ మరియు డీజిల్ వినియోగం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలలో తగ్గుముఖం పట్టాయి.
పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల భారతదేశంలో వాయు కాలుష్య సమస్యలు విపరీతంగా పెరిగాయి. కానీ లాక్ డౌన్ కారణంగా వాహనాల రద్దీ నిలిచిపోవడంతో ఇప్పుడు గాలి కాలుష్యం దాదాపు చాలా వరకు తగ్గిపోయిందని నివేదికల ద్వారా విల్లడించారు.