Just In
- 5 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 7 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 8 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 11 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
లాక్డౌన్ లో ఇల్లు చేరడానికి సైకిల్స్ దొంగలించిన కార్మికుడు, తర్వాత ఏం జరిగిందంటే..?
సాధారణంగా గ్రామాలలో ప్రజలు ఉపాధి పొందడం కోసం గ్రామాలను విడిచిపెట్టి నగరాల్లో నివసించడం సహజం. కానీ నేడు కరోనా వైరస్ అందరి జీవితాలను తలక్రిందులు చేసింది. కరోనా వైరస్ ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేసింది. ఈ కరోనా నేపథ్యంలో వలస కార్మికులు తమ ఇళ్లకు చేరుకోవడానికి కొత్త కొత్త ఉపాయాలను ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంలో అనేక కొత్త సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
కరోనా లాక్ డౌన్ లో లక్షలాది మంది వలస కార్మికులు ఇప్పుడు తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అమలు చేసిన లాక్డౌన్ లో చాలా మంది కార్మికులు చిక్కుకుపోయింది. కరోనా వైరస్ వల్ల భవన నిర్మాణం, ఫ్యాక్టరీ, హోటల్, బేకరీ మరియు టీ షాపులలోని కార్మికులను నిరుద్యోగులుగా చేసింది.
దీనివల్ల కార్మికులు తమ ఇళ్లకు తిరిగి రావడానికి నిర్చయించుకున్నారు. లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుండి ప్రజా రవాణా మొత్తం రద్దు చేయబడింది. ప్రజా రవాణా వాహనాలైన బస్సు, రైలు, విమానం, ఆటో, టాక్సీల సేవలు అన్ని నిలిపివేయబడ్డాయి.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : 1500 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణానికి సిద్దమైన కార్మికులు
ఈ కారణంగా, చాలా మంది ప్రజలు సైకిళ్లపై, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. లాక్ డౌన్ లో కారు మరియు బైక్ ద్వారా ప్రయాణించడానికి ప్రత్యేక అనుమతి అవసరం. లేకపోతే అలాంటి వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. కానీ పేద కార్మికులకు కారు లేదా బైక్ లేనందున, వారు సైకిల్ ద్వారా ప్రయాణిస్తారు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సొంత వాహనం లేని ఒక వ్యక్తి తన స్వగ్రామానికి చేరుకోవడానికి ఒక సైకిల్ దొంగిలించాడు. రాజస్థాన్లోని భరత్పూర్కి చెందిన కూలీ అయిన ముహమ్మద్ ఇక్బాల్ అతని స్వస్థలం ఉత్తర ప్రదేశ్లోని బరేలీ.
MOST READ:భారత్లో విడుదల కానున్న కొత్త స్కోడా కరోక్ ఎస్యూవీ ఎలా ఉందో చూసారా !
లాక్ డౌన్ కారణంగా అతను భరత్పూర్ లో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ సమయంలో అతను బరేలీకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, అతనికి ఎటువంటి వాహనం లేదు. కొడుకుతో కలిసి బరేలీకి వెళుతున్న మహమ్మద్ ఇక్బాల్ భరత్పూర్ లోని రారా గ్రామానికి చెందిన సహబ్ సింగ్ ఇంటి వద్ద ఆపి ఉంచిన సైకిల్ దొంగిలించాడు.
అతని స్వస్థలం భరత్పూర్ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. సైకిల్ దొంగిలించబడిన తరువాత బాగా తెలియని మహ్మద్ ఇక్బాల్ క్షమాపణ లేఖ రాసి సైకిల్పై ఉంచాడు.
MOST READ:కవాసకి W800 స్ట్రీట్ క్రూయిజర్ బైక్ఫై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా
ఆ లేఖలో, నేను ఒక రోజు కూలీ, నేను మీ సైకిల్ను నిస్సహాయ స్థితిలో దొంగిలించాను, నా స్వగ్రామానికి వెళ్ళడానికి వేరే మార్గం లేదు. ఇక్కడ ఎటువంటి పని లేకపోవడం వల్ల నా కొడుకుతో స్వగ్రామానికి వెళ్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని లేఖలో రాసాడు.
కరోనావైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి అమలులో ఉన్న లాక్ డౌన్ కార్మికుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి.
Note: Images are representative purpose only.
MOST READ:జపాన్లో ఆవిష్కరించిన మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్లిఫ్ట్