లాక్‌డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ లాక్ డౌన్ మర్చి 24 నుంచి దాదాపు 23 రోజులపాటు ఏప్రిల్ 14 వరకు అమలు చేశారు. కానీ కరోనా వ్యాప్తి అనుకున్న విధంగా నివారించడానికి వీలులేని కారణంగా రెండవ దశ లాక్ డౌన్ 2020 మే 03 వరకు ప్రకటించారు. రెండవ దశ లాక్ డౌన్ కూడా పొడిగిస్తూ మే 17 వరకు ప్రకటించారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?

భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కొరోనా వైరస్ సంక్రమణల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలు ఇంటి వద్దే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?

అత్యవసర సమయాల్లో తప్ప ప్రజలు బయటకి రాకూడదని అధికారులు ఆదేశించారు. కానీ ఈ సూచనలను కూడా ఉల్లంఘిస్తూ చాలామంది వ్యక్తులు ఇప్పటికీ రోడ్డు మీదికి వస్తున్నారు. ఈ విధంగా లాక్ డౌన్ ని ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.

MOST READ:ఆకాశంలోకి ఎగరటానికి ట్రై చేసిన హీరో అక్షయ్ కుమార్ [వీడియో]

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?

లాక్‌డౌన్ నిబంధనను ఉల్లంఘించిన వాహనదారులపై దేశవ్యాప్తంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇప్పటివరకు 1.2 లక్షలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?

మార్చి 22 నుంచి ఇప్పటి వరకు 1.2 లక్షల వాహనాలను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 1.1 లక్షల ద్విచక్ర వాహనాలు, 4,881 త్రీ వీలర్లు, 3,390 కార్లు మరియు 539 ఇతర వాహనాలు ఉన్నాయి.

MOST READ:నిస్సాన్ కి కష్ట కాలం : నిలిపివేయబడిన టెర్రానో ఎస్‌యువి

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?

తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు మరియు సరైన కారణం లేకుండా బయటకు వచ్చే వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు మరియు వాలంటీర్ల గుర్తింపు కార్డులను కూడా తనిఖీ చేస్తున్నారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?

అత్యవసర సమయాల్లో బయటకి వచ్చే వాహనాలను కూడా పరీక్షిస్తున్నారు. తెలంగాణ పోలీసులు అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

MOST READ:నిజంగా ఈ పెళ్లి కొడుకు అదృష్టవంతుడే, ఎందుకో మీరే చూడండి

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?

ఈ సంఘటన గురించి సీనియర్ పోలీసు అధికారులు మాట్లాడుతూ, సరైన కారణం లేకుండా బయటకు వస్తున్న వాహనాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని, అంతే కాకుండా వాహన యజమానులపై కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను కోర్టుకు అప్పగించనున్నారు.

లాక్‌డౌన్ సడలించిన తర్వాత వాహనాలను తిరిగి ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ 21 న మాత్రం దాదాపు 7,000 ద్విచక్ర వాహనాలు, 181 త్రీ వీలర్లు, 290 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?

దీనిపై తెలంగాణ టుడే నివేదిస్తూ భారతదేశంలో నిబంధనలను ఉల్లంఘించడం మరియు ఆ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సర్వసాధారణం. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

MOST READ:లాక్‌డౌన్‌లో ఎమ్మెల్యే స్టిక్కర్ తో పట్టుబడ్డ యువకుడు, చివరికి ఏమైందంటే ?

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?

దేశవ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ మూడవ దశ అమలులో ఉంది. దీని ప్రకారం అన్ని రాష్ట్రాలను గ్రీన్ ఆరంజ్ మరియు రెడ్ జోన్లుగా విభజించారు. ఆ జోన్లలో కొంత వరకు లాక్ డౌన్ సడలింపులు కూడా ప్రకటించారు. కానీ ఇటువంటి సమయంలో కూడా సామజిక దూరం పాటించి కరోనా నుంచి విముక్తి పొందాలి. కాబట్టి వీలైనంత వరకు బయటకు వెళ్లడం మానుకోవాలి. ఇప్పుడు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో ప్రభుత్వాలకు మద్దతుగా ప్రజలు ఇంట్లోనే ఉండాలి.

Most Read Articles

English summary
Telangana police seizes around 1.2 lakh vehicles during lockdown. Read in Telugu.
Story first published: Tuesday, May 5, 2020, 17:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X