Just In
- 12 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 14 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 17 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 18 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి
కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువగా సంక్రమిస్తున్న కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ మూడవ దశలో ఉంది. ఈ లాక్ డౌన్ 2020 మే 17 వరకు ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడవ దశలో లాక్ డౌన్ నుంచి కొన్ని విరమణలు కూడా కల్పించారు.
లాక్ డౌన్ లో కలిగించిన కొన్ని మినహాయింపుల ప్రకారం గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని వాహన సేవలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. రెడ్ జోన్లో ఇప్పటికి కఠినమైన నిబంధనలను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలి.
కరోనా వైరస్ సంక్రమణము నివారించాలంటే సామాజిక దూరం చాలా అవసరం కాబట్టి ఈ క్రమంలో ఒక పాల వ్యాపారి ఒక కొత్త పద్దతిని ప్రవేశపెట్టాడు. ఇది అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
MOST READ:భారత్లో విడుదల కానున్న 2020 డుకాటీ మల్టీస్ట్రాడా 950 బైక్
కోవిడ్ -19 వ్యాప్తి మధ్య సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ వినియోగదారులకు పాలు సరఫరా చేయడానికి తన బైక్కి కట్టిన గరాటు మరియు పైపును ఉపయోగించి ఒక మిల్క్మ్యాన్ ఫోటో మనం ఇక్కడ చూడవచ్చు.
ఈ చిత్రాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి నితిన్ సంగ్వాన్ ట్విట్టర్లో షేర్ చేసాడు. ఇటీవల కాలంలో చాలామంది తమను మరియు తమ నుండి ఇతరులను కరోనా వైరస్ నుంచి రక్షించడానికి కొత్త ఉపాయాలను ఆలోచిస్తున్నారు.
MOST READ:ఇండియాలో ఎప్రిలియా RS 660 బైక్ లాంచ్ ఎప్పుడో తెలుసా ?
ఇప్పుడు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై అత్యవసర సమయాల్లో బయటకు వచ్చినప్పుడు కూడా మాస్కులు మరియు గ్లౌజులు వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో పాల వ్యాపారి ఈ విధంగా అలోచించి సామజిక దూరాన్ని అమలుచేస్తున్నాడు.
సంగ్వాన్ షేర్ చేసిన ఈ చిత్రంలో ఒక పాలవ్యాపారి సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ తన వినియోగదారునికి పాలు సరఫరా చేయడాన్ని చూడవచ్చు. అతను తన బైక్కు ఒక గరాటు మరియు పైపును అటాచ్ చేసి అలా చేశాడు. పాలు కావాలనుకున్న కస్టమర్ పైపు చివర నిలబడతాడు. అప్పుడు పాల వ్యక్తి పాలు గరాటు ద్వారా సరఫరా చేస్తాడు.
MOST READ:రీస్టార్ట్ చేయనున్న హోండా మోటార్ సైకిల్స్
ఈ కరోనా నేపథ్యంలో చాలామంది ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారట. ఇటీవల కాలంలో ఒకవ్యక్తి తన కుమార్తె కోసం సామాజిక దూరాన్ని పాటించే ఒక బైక్ కూడా తయారు చేసాడు. ఇది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.